Trends

ఎన్నారై కరోనా బిల్లు 1.52 కోట్లు మాఫీ !!

కరోనా మనుషుల్ని చంపేస్తున్న ఉదంతాలు తెలిసినవే. దీని బారిన పడిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తున్న బిల్లులతో గుల్లగుల్ల అయిపోతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయిలువసూలు చేసే హైదరాబాద్ ఆసుపత్రుల తీరు మనకు తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన ఉదంతం చూస్తే.. సదరు ఆసుపత్రి స్పందనకు ఫిదా కావటం ఖాయం. ఎందుకంటే.. తాము వేసిన రూ.1.52కోట్ల కరోనా బిల్లును పైసా కట్టకుండా మాఫీ చేయటమే దీనికి కారణం. అదెలా జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలకు చెందిన 42 ఏళ్ల రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వలస వెళ్లాడు. అక్కడ పనిలో చేరిన అతనికి కొద్దికాలానికే కరోనా బారిన పడ్డాడు. అతడ్ని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 80 రోజులు చికిత్స పొందాడు. చివరకు ఆసుపత్రి యాజమాన్యం వేసిన బిల్లు చూసి అతడి గుండె ఆగినంత పనైంది.

కారణం..ఆసుపత్రి బిల్లు ఏకంగా రూ.1.52కోట్లు కావటమే. దీంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి. బిల్లు కట్టని కారణంగా ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
తనకు ఎదురైన పరిస్థితితో పాటు.. తన ఆర్థిక స్థితిగతుల గురించి చెబుతూ భారత ఎంబసీకి లేఖ రాశారు. దీనికి స్పందించిన ఎంబసీ ఆసుపత్రి వర్గాల్ని సంప్రదించింది. బిల్లును మినహాయించాలని కోరింది.

దీనికి స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం బిల్లును మినహాయింపు ఇవ్వటంతో అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇక్కడ మరికొన్ని విషయాల్ని చెప్పాలి. చేతిలో డబ్బుల్లేని రాజేశ్ స్థితిగతుల గురించి తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం అతను ఇండియాకు వెళ్లటానికి అవసరమైన విమానటిక్కెట్లను కొనుగోలు చేసి ఇవ్వటమే కాదు.. దారి ఖర్చుల కోసం రూ.10వేలను అతని చేతిలో పెట్టింది. భారత ఎంబసీతో పాటు.. సదరు ఆసుపత్రి పెద్ద మనసు తెలిసిన వారంతా ఫిదా అవుతున్నారు. తాజాగా అతను హైదరాబాద్ చేరుకున్నాడు.

This post was last modified on July 17, 2020 3:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: COVID-19

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

54 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago