కరోనా మనుషుల్ని చంపేస్తున్న ఉదంతాలు తెలిసినవే. దీని బారిన పడిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తున్న బిల్లులతో గుల్లగుల్ల అయిపోతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయిలువసూలు చేసే హైదరాబాద్ ఆసుపత్రుల తీరు మనకు తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన ఉదంతం చూస్తే.. సదరు ఆసుపత్రి స్పందనకు ఫిదా కావటం ఖాయం. ఎందుకంటే.. తాము వేసిన రూ.1.52కోట్ల కరోనా బిల్లును పైసా కట్టకుండా మాఫీ చేయటమే దీనికి కారణం. అదెలా జరిగిందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలకు చెందిన 42 ఏళ్ల రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వలస వెళ్లాడు. అక్కడ పనిలో చేరిన అతనికి కొద్దికాలానికే కరోనా బారిన పడ్డాడు. అతడ్ని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 80 రోజులు చికిత్స పొందాడు. చివరకు ఆసుపత్రి యాజమాన్యం వేసిన బిల్లు చూసి అతడి గుండె ఆగినంత పనైంది.
కారణం..ఆసుపత్రి బిల్లు ఏకంగా రూ.1.52కోట్లు కావటమే. దీంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి. బిల్లు కట్టని కారణంగా ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
తనకు ఎదురైన పరిస్థితితో పాటు.. తన ఆర్థిక స్థితిగతుల గురించి చెబుతూ భారత ఎంబసీకి లేఖ రాశారు. దీనికి స్పందించిన ఎంబసీ ఆసుపత్రి వర్గాల్ని సంప్రదించింది. బిల్లును మినహాయించాలని కోరింది.
దీనికి స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం బిల్లును మినహాయింపు ఇవ్వటంతో అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇక్కడ మరికొన్ని విషయాల్ని చెప్పాలి. చేతిలో డబ్బుల్లేని రాజేశ్ స్థితిగతుల గురించి తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం అతను ఇండియాకు వెళ్లటానికి అవసరమైన విమానటిక్కెట్లను కొనుగోలు చేసి ఇవ్వటమే కాదు.. దారి ఖర్చుల కోసం రూ.10వేలను అతని చేతిలో పెట్టింది. భారత ఎంబసీతో పాటు.. సదరు ఆసుపత్రి పెద్ద మనసు తెలిసిన వారంతా ఫిదా అవుతున్నారు. తాజాగా అతను హైదరాబాద్ చేరుకున్నాడు.
This post was last modified on July 17, 2020 3:40 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…