Trends

బీచ్ లో 2500 మంది నగ్న ఫొటో షూట్

ఈ మధ్యకాలంలో మీడియా ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో తెలీదుగానీ..ప్రజలకు సామాజిక బాధ్యతపై అవగాహన కాస్త పెరిగిందనే చెప్పవచ్చు. సామాజిక సమస్యలపై, ఏదైనా ఒక చారిటీ కోసమే, కొన్ని జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకో సెలబ్రిటీలు, సినీతారలతోపాటు సామాన్యులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమకు తోచింది చేస్తున్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 5కే రన్ వంటి కార్యక్రమాలు గతంలో నిర్వహించేవారు.

అయితే, ప్రస్తుతం చాలామంది జనం బద్ధకిస్టులగా మారిన నేపథ్యంలో ఈ రన్ లకు ఆదరణ కాస్త తగ్గింది. అందుకే, ఆస్ట్రేలియాలోని కొందరు ప్రజలు…స్కిన్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు వినూత్న తరహాలో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 2500 మంది స్వచ్చందంగా బీచ్ దగ్గరకు వచ్చి నగ్నంగా సూర్య కిరణాల ముందు నిలబడిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వ‌ద్ద 2,500 మంది జనం న‌గ్నంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆస్ట్రేలియాలో 70 సంవత్సరాల వయస్సులోపున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్కిన్ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అందుకే, ఈ స్కిన్ క్యాన్సర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు అమెరికన్ ఫొటోగ్రాఫ‌ర్ స్పెన్సర్ టునిక్ ఈ వినూత్న అవగాహనా కార్యక్రమం చేప‌ట్టారు. అతడిచ్చిన పిలుపునకు స్పందించి దాదాపు 2,500 మంది వ్యక్తులు ఈ నగ్న ప్రదర్శనకు సహకరించారు.

ప్రపంచం ప్రసిద్ధ ప్రాంతాల్లో సామూహిక నగ్న ఫోటో షూట్‌లను ప్రదర్శించడంలో టునిక్ కు మంచి పేరుంది. నేక్డ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌పై స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసిన టునిక్ 2010లో సిడ్నీలో 5,200 మంది నగ్న ఫొటో షూట్ చేశాడు.

This post was last modified on November 26, 2022 10:14 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

3 hours ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

3 hours ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

5 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

7 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

9 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

11 hours ago