Trends

బీచ్ లో 2500 మంది నగ్న ఫొటో షూట్

ఈ మధ్యకాలంలో మీడియా ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో తెలీదుగానీ..ప్రజలకు సామాజిక బాధ్యతపై అవగాహన కాస్త పెరిగిందనే చెప్పవచ్చు. సామాజిక సమస్యలపై, ఏదైనా ఒక చారిటీ కోసమే, కొన్ని జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకో సెలబ్రిటీలు, సినీతారలతోపాటు సామాన్యులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమకు తోచింది చేస్తున్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 5కే రన్ వంటి కార్యక్రమాలు గతంలో నిర్వహించేవారు.

అయితే, ప్రస్తుతం చాలామంది జనం బద్ధకిస్టులగా మారిన నేపథ్యంలో ఈ రన్ లకు ఆదరణ కాస్త తగ్గింది. అందుకే, ఆస్ట్రేలియాలోని కొందరు ప్రజలు…స్కిన్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు వినూత్న తరహాలో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 2500 మంది స్వచ్చందంగా బీచ్ దగ్గరకు వచ్చి నగ్నంగా సూర్య కిరణాల ముందు నిలబడిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వ‌ద్ద 2,500 మంది జనం న‌గ్నంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆస్ట్రేలియాలో 70 సంవత్సరాల వయస్సులోపున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్కిన్ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అందుకే, ఈ స్కిన్ క్యాన్సర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు అమెరికన్ ఫొటోగ్రాఫ‌ర్ స్పెన్సర్ టునిక్ ఈ వినూత్న అవగాహనా కార్యక్రమం చేప‌ట్టారు. అతడిచ్చిన పిలుపునకు స్పందించి దాదాపు 2,500 మంది వ్యక్తులు ఈ నగ్న ప్రదర్శనకు సహకరించారు.

ప్రపంచం ప్రసిద్ధ ప్రాంతాల్లో సామూహిక నగ్న ఫోటో షూట్‌లను ప్రదర్శించడంలో టునిక్ కు మంచి పేరుంది. నేక్డ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌పై స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసిన టునిక్ 2010లో సిడ్నీలో 5,200 మంది నగ్న ఫొటో షూట్ చేశాడు.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

25 minutes ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

40 minutes ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

45 minutes ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

1 hour ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

2 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

2 hours ago