కేవలం శృంగారం కోసం.. ఓ మహిళ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేసి.. తాజాగా పరిచయమైన ప్రియుడితో జంపైపోయింది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటన ఎక్కడో కాదు.. ఏపీలోని నెల్లూరులోనే జరిగింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన.. నివ్వెరపోయేలా చేసింది.
ఆమెకు పెళ్లైంది.. నలుగురు పిల్లలు ఉన్నారు.. అయినా సరే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంకేముంది ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. బస్తాలో మూట కట్టి చెరువులో పడేసింది. నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామానికి చెందిన శోభ, మణి అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. ఈ దంపతులు పంటపాళెం గ్రామంలో నివాసముంటున్నారు. రొయ్యల గుంట వద్ద కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తున్న వీరికి నలుగురు పిల్లలున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో.. భరత్ అనే వ్యక్తి ప్రవేశించాడు.
శోభ, భరత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో.. కాపురంలో కలతలు మొదలయ్యాయి. ప్రియుడు భరత్పై మోజు పెంచుకున్న శోభ.. భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజుల క్రితం ప్రియుడు భరత్, మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో గ్రామ సమీపంలోని నక్కల కాలువ వద్ద మణిని గొంతు నులిమి చంపేశారు.
మృతదేహాన్ని గోతం సంచిలో మూటగట్టి నీటి ప్రవాహం అధికంగా ఉండే నక్కల కాలువలో పడేశారు. కాలువలో గోతాం సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోగి దిగిన పోలీసులు గోతామును బయటకు తీసి మణి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ హత్య చేసింది భార్య శోభనేనని నిర్ధారించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…