పుర్రెకో బుద్ధి…జిహ్వకో రుచి అన్నారు పెద్దలు…ఈ సోషల్ మీడియా జమానాలో వినూత్నమైన ఆలోచనలను జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే, చాలామంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు సరికొత్త కాన్సెప్ట్ లతో కస్టమర్ల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్, హోటల్స్ వంటి బిజినెస్ లలో వెరైటీ కాన్సెప్ట్ లు పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రుచికరమైన ఐటమ్స్, పరిశుభ్రమైన వాతావరణం ఉంటే చాలు అన్నది గతంలో మాట.
మారుతున్న ట్రెండ్ ప్రకారం పైన చెప్పిన వాటితో పాటు ఆ హోటల్ లేదా రెస్టారెంట్ లో ఇంటీరియర్ డిజైనింగ్, అక్కడి థీం వంటి విషయాలు కూడా ఆ హోటల్ బిజినెస్ పై ప్రభావం చూపే పరిస్థితులున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా రెస్టారెంట్లు, హోటళ్లు, కాఫీ షాపుల ఓనర్లు వినూత్నమైన థీమ్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ హోటల్ యజమాని బుర్రలో పుట్టిన ఆలోచన ఎంతోమంది కస్టమర్ల జిహ్వకు రుచిని అందించనుంది.
హైదరాబాదులోని పిస్తా హౌస్ హోటల్ యజమాని తాజాగా ఏరోప్లేన్ హోటల్ ను ప్రారంభించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. కేరళలో జరిగిన ఒక ఆక్షన్ లో ఒక పాత విమానాన్ని పిస్తా హౌజ్ యజమాని కొనుగోలు చేశారు. దానిని, హైదరాబాద్ కు తీసుకువచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ తో పాటు రెస్టారెంట్ కు అనుగుణంగా మార్పులుచేర్పులు చేశారు. ఈ క్రమంలోనే ఏరోప్లేన్ రెస్టారెంట్ ను సందర్శించేందుకు జనం క్యూ కడుతున్నారు.
అయితే హైదరాబాద్ కు ఈ కాన్సెప్ట్ కొత్తగా అనిపించొచ్చు కానీ ఈ తరహా ఏరోప్లేన్ రెస్టారెంట్ విజయవాడ సమీపంలోని గన్నవరం ప్రాంతంలో ఆల్రెడీ చాలా కాలం నుంచి ఉంది. విజయవాడ-ఏలూరు హైవేపై గన్నవరం సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ విజయవాడ పరిసర ప్రాంతవాసులకు సుపరిచితమే. ఏదేమైనా హైదరాబాద్ పిస్తా హౌస్ ఏరోప్లేన్ రెస్టారెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 14, 2022 3:21 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…