ఇప్పటి వరకు ఉచితంగా అందుతున్న ట్విట్టర్ సేవలకు మస్క్ రేటు కట్టారు. ఇటీవలే టేకోవర్ చేసిన ట్విట్టర్పై ఆయన బిజినెస్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ట్విట్టర్ ఇక ఖరీదు కానుంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాక ఆ సంస్థ రూల్స్లో అనేక మార్పులు జరగనున్నాయి. ఇప్పుడు బ్లూ బ్యాడ్జ్ ఫీచర్లోనూ మస్క్ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై బ్లూ టిక్ కావాలంటే నెలకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుందని అనధికారికంగా తెలుస్తోంది. దీనిపై మస్క్ ప్రకటన చేయనున్నారు.
ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న వెంటనే ఎలాన్ మస్క్ సంస్థ సంబంధిత విషయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగులను తొలగించారు. ఇంకా తొలగిస్తానని కూడా ప్రకటించారు. ఇక, ఇప్పుడు వినియోగదారులపై ఆయన పడ్డారు. బ్లూ బ్యాడ్జ్ ఫీచర్లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యూజర్లకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా మారిపోతుందని తాజాగా మస్క్ ట్వీట్ చేశారు.
వెరిఫైడ్ అకౌంట్ కలిగి ఉండాలని భావించే వారు అంటే బ్లూ టిక్ కోరుకునే వారు ఇకపై చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుందని సమాచారం. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఈ దిశగా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. నెలకు 19.99 డాలర్లు చెల్లించాల్లిందేనని నిపుణులు చెబుతున్నారు. మన కరెన్సీలో చెప్పుకుంటే నెలకు దాదాపు రూ.1600 కట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే బ్లూ టిక్ కేవలం 90 రోజులే ఉంటుంది. ఈ కొత్త రూల్ను నవంబర్ 7 నాటికి అమలులోకి తీసుకువచ్చే దిశగా మస్క్ యోచిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత పనులు పూర్తి చేయకపోతే ఈ ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేందుకు ఆయన సిద్ధం అయినట్లు సమాచారం. 2021లో ట్విట్టర్ బ్లూ టిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ బ్లూ టిక్ కలిగిన వారికి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ట్వీట్స్ను ఎడిట్ చేసుకోవడం సహా పలు రకాల సర్వీసులు పొందొచ్చు.
This post was last modified on October 31, 2022 3:44 pm
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…