Trends

ట్విట్ట‌ర్ ఇక ఫ్రీ కాదు బ్రో.. మ‌స్క్ షాక్ ఇదే!

ఇప్ప‌టి వ‌ర‌కు ఉచితంగా అందుతున్న ట్విట్ట‌ర్ సేవ‌ల‌కు మ‌స్క్ రేటు క‌ట్టారు. ఇటీవ‌లే టేకోవ‌ర్ చేసిన ట్విట్ట‌ర్‌పై ఆయ‌న బిజినెస్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ట్విట్ట‌ర్ ఇక ఖ‌రీదు కానుంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాక ఆ సంస్థ రూల్స్లో అనేక మార్పులు జరగనున్నాయి. ఇప్పుడు బ్లూ బ్యాడ్జ్‌ ఫీచర్‌లోనూ మస్క్ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై బ్లూ టిక్‌ కావాలంటే నెలకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుందని అన‌ధికారికంగా తెలుస్తోంది. దీనిపై మ‌స్క్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న వెంట‌నే ఎలాన్‌ మస్క్‌ సంస్థ సంబంధిత విషయాల్లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఉద్యోగుల‌ను తొల‌గించారు. ఇంకా తొల‌గిస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు వినియోగ‌దారుల‌పై ఆయ‌న ప‌డ్డారు. బ్లూ బ్యాడ్జ్‌ ఫీచర్‌లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యూజర్లకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా మారిపోతుందని తాజాగా మస్క్ ట్వీట్ చేశారు.

వెరిఫైడ్ అకౌంట్ కలిగి ఉండాలని భావించే వారు అంటే బ్లూ టిక్ కోరుకునే వారు ఇకపై చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుందని సమాచారం. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఈ దిశగా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. నెలకు 19.99 డాలర్లు చెల్లించాల్లిందేనని నిపుణులు చెబుతున్నారు. మన కరెన్సీలో చెప్పుకుంటే నెలకు దాదాపు రూ.1600 కట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోతే బ్లూ టిక్ కేవలం 90 రోజులే ఉంటుంది. ఈ కొత్త రూల్‌ను నవంబర్ 7 నాటికి అమలులోకి తీసుకువచ్చే దిశగా మస్క్ యోచిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత పనులు పూర్తి చేయకపోతే ఈ ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేందుకు ఆయన సిద్ధం అయినట్లు సమాచారం. 2021లో ట్విట్టర్ బ్లూ టిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ బ్లూ టిక్ కలిగిన వారికి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ట్వీట్స్‌ను ఎడిట్ చేసుకోవడం సహా పలు రకాల సర్వీసులు పొందొచ్చు.

This post was last modified on October 31, 2022 3:44 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

1 hour ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago