ఇప్పటి వరకు ఉచితంగా అందుతున్న ట్విట్టర్ సేవలకు మస్క్ రేటు కట్టారు. ఇటీవలే టేకోవర్ చేసిన ట్విట్టర్పై ఆయన బిజినెస్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ట్విట్టర్ ఇక ఖరీదు కానుంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాక ఆ సంస్థ రూల్స్లో అనేక మార్పులు జరగనున్నాయి. ఇప్పుడు బ్లూ బ్యాడ్జ్ ఫీచర్లోనూ మస్క్ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై బ్లూ టిక్ కావాలంటే నెలకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుందని అనధికారికంగా తెలుస్తోంది. దీనిపై మస్క్ ప్రకటన చేయనున్నారు.
ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న వెంటనే ఎలాన్ మస్క్ సంస్థ సంబంధిత విషయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగులను తొలగించారు. ఇంకా తొలగిస్తానని కూడా ప్రకటించారు. ఇక, ఇప్పుడు వినియోగదారులపై ఆయన పడ్డారు. బ్లూ బ్యాడ్జ్ ఫీచర్లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యూజర్లకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా మారిపోతుందని తాజాగా మస్క్ ట్వీట్ చేశారు.
వెరిఫైడ్ అకౌంట్ కలిగి ఉండాలని భావించే వారు అంటే బ్లూ టిక్ కోరుకునే వారు ఇకపై చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుందని సమాచారం. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఈ దిశగా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. నెలకు 19.99 డాలర్లు చెల్లించాల్లిందేనని నిపుణులు చెబుతున్నారు. మన కరెన్సీలో చెప్పుకుంటే నెలకు దాదాపు రూ.1600 కట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే బ్లూ టిక్ కేవలం 90 రోజులే ఉంటుంది. ఈ కొత్త రూల్ను నవంబర్ 7 నాటికి అమలులోకి తీసుకువచ్చే దిశగా మస్క్ యోచిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత పనులు పూర్తి చేయకపోతే ఈ ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేందుకు ఆయన సిద్ధం అయినట్లు సమాచారం. 2021లో ట్విట్టర్ బ్లూ టిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ బ్లూ టిక్ కలిగిన వారికి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ట్వీట్స్ను ఎడిట్ చేసుకోవడం సహా పలు రకాల సర్వీసులు పొందొచ్చు.
This post was last modified on October 31, 2022 3:44 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…