హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన భార్య మిస్సయిన వ్యవహారం ఇపుడు జంటనగరాల్లో హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఆ వివాహిత కావాలనే భర్తను వదిలి వెళ్లిపోయిందా లేదంటే కిడ్నాప్ నకు గురైందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్టోబర్ 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్ లో సినిమాకు వెళ్లాడు. అయితే, సినిమా చూస్తుండగా మధ్యంలో శైలజ వాష్ రూంకు వెళ్లి వస్తానని చెప్పింది. అలా బయటకు వెళ్లిన శైలజ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భర్త భాస్కర్ రెడ్డి కంగారుపడ్డారు. వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారమిచ్చారు.
మహిళా సిబ్బంది సాయంతో వాష్ రూం మొత్త వెతికి చూశారు. ఎంత వెతికినా సరే, భార్య శైలజ జాడ తెలియలేదు. ఆ తర్వాత థియేటర్ పరిసర ప్రాంతాల్లో శైలజ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో, తన భార్య దగ్గర సెల్ కూడా లేదని, ఆమె జాడ తెలియడం లేదని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబి మాల్ లోని సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
అయితే, గతంలో విశాఖ బీచ్ లో అదృశ్యమైన భార్య ఆ తర్వాత నెల్లూరులో తన ప్రియుడితో తేలిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 25, 2022 8:02 am
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…