Trends

టీ20 టికెట్ల కోసం తొక్కిసలాట…మహిళ మృతి?

హైదరాబాద్ లోని జింఖానా స్టేడియం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ ఆదివారం నాడు జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల కోసం వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆ లాఠీ చార్జి సందర్భంగా ఓ మహిళ మృతి చెందినట్లు, మరో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.

ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానా మైదానంలో మ్యాచ్ టికెట్లు ఆఫ్ లైన్ లో విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిన్న రాత్రి ప్రకటించింది. దీంతో, ఈరోజు తెల్లవారుజామున నుంచే వేలాది మంది అభిమానులు స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే జింఖానా గేటు దగ్గర నుంచి ప్యారడైజ్ సిగ్నల్ వరకు కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు.

అయితే, ఉదయం 11 దాటినప్పటికీ టికెట్ కౌంటర్లు తెరవకపోవడంతో కొంతమంది యువకులు అసహనం వ్యక్తం చేశారు. దాంతోపాటు, కేవలం 3000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రచారం జరగడంతో అభిమాననులంతా ఒక్కసారిగా కౌంటర్లు వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. కొంతమంది గేట్లు తోసుకొని, గోడలు దూకి గ్రౌండ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దాదాపు 30 వేల మంది స్టేడియం దగ్గర ఉండడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు.

ఈ సందర్భంగా పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పడంతో అభిమానులను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్లను మూసివేసి టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. ప్రస్తుతానికి స్టేడియం దగ్గర భారీగా పోలీసులను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

This post was last modified on September 22, 2022 4:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

2 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

2 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

2 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

3 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

3 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

4 hours ago