హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. డబీర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం షాకింగ్ గా మారింది. పదమూడేళ్ల చిరుప్రాయంలో ఉన్న బాలికను.. ఆమె నివసించే ప్రాంతానికి చెందిన కొందరు కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ నకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
చంచల్ గూడకు చెందిన పదమూడేళ్ల ఒక మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి.. పరారయ్యారు.
స్ప్రహలోకి వచ్చిన బాధిత బాలిక తనకు జరిగిన దారుణం గురించి ఇంట్లో వారికి చెప్పటంతో.. బాలిక తల్లిదండ్రులు డబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నిందితులు బాధితురాలికి తెలిసిన వారు కావటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెప్పిన నేపథ్యంలో బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు.
This post was last modified on September 15, 2022 2:06 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…