హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. డబీర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం షాకింగ్ గా మారింది. పదమూడేళ్ల చిరుప్రాయంలో ఉన్న బాలికను.. ఆమె నివసించే ప్రాంతానికి చెందిన కొందరు కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ నకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
చంచల్ గూడకు చెందిన పదమూడేళ్ల ఒక మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి.. పరారయ్యారు.
స్ప్రహలోకి వచ్చిన బాధిత బాలిక తనకు జరిగిన దారుణం గురించి ఇంట్లో వారికి చెప్పటంతో.. బాలిక తల్లిదండ్రులు డబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నిందితులు బాధితురాలికి తెలిసిన వారు కావటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెప్పిన నేపథ్యంలో బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు.
This post was last modified on September 15, 2022 2:06 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…