హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. డబీర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం షాకింగ్ గా మారింది. పదమూడేళ్ల చిరుప్రాయంలో ఉన్న బాలికను.. ఆమె నివసించే ప్రాంతానికి చెందిన కొందరు కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ నకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
చంచల్ గూడకు చెందిన పదమూడేళ్ల ఒక మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి.. పరారయ్యారు.
స్ప్రహలోకి వచ్చిన బాధిత బాలిక తనకు జరిగిన దారుణం గురించి ఇంట్లో వారికి చెప్పటంతో.. బాలిక తల్లిదండ్రులు డబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నిందితులు బాధితురాలికి తెలిసిన వారు కావటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెప్పిన నేపథ్యంలో బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు.
This post was last modified on September 15, 2022 2:06 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…