హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. డబీర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం షాకింగ్ గా మారింది. పదమూడేళ్ల చిరుప్రాయంలో ఉన్న బాలికను.. ఆమె నివసించే ప్రాంతానికి చెందిన కొందరు కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ నకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
చంచల్ గూడకు చెందిన పదమూడేళ్ల ఒక మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి.. పరారయ్యారు.
స్ప్రహలోకి వచ్చిన బాధిత బాలిక తనకు జరిగిన దారుణం గురించి ఇంట్లో వారికి చెప్పటంతో.. బాలిక తల్లిదండ్రులు డబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నిందితులు బాధితురాలికి తెలిసిన వారు కావటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెప్పిన నేపథ్యంలో బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు.
This post was last modified on September 15, 2022 2:06 pm
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…