Trends

హైదరాబాద్ లో.. వేటకొడవలితో గర్భిణి హత్య

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు…అని ప్రజా కవి గోరటి వెంకన్న రాసిన మాటలు అక్షర సత్యాలు. ఈ కలికాలంలో చిన్న చిన్న కారణాలతో, క్షణికావేశంలో కట్టుకున్న వారిని సైతం కసాయిగా మారి కడతేరుస్తున్న వైనాలు ఎన్నో చూశాం. ఆస్తికోసమో, ప్రేమ నిరాకరించారనో, పగ, ప్రతీకరామో…ఇలా కారణమేదైనా సరే సాటి మనిషిని పాశవికంగా హతమార్చడానికి కూడా కొందరు వెనుకాడడం లేదు.

మానవ మృగాలుగా మారి తోటి మనిషి ప్రాణాలు బలి తీసుకోవాలన్న రక్తదాహంతో కొందరు రక్త సంబంధాలను కూడా విస్మరిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్లో నిండు గర్భిణిని ఆమె ఆడపడుచు భర్త అమానుషంగా హత్య చేసిన వైనం మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వి.వెంకట రామకృష్ణ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్రవంతి, కూతురు చైత్ర ఉన్నారు. ప్రస్తుతం స్రవంతి ఎనిమిది నెలల నిండు గర్భిణి. 2020లో తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కావూరు శ్రీరామకృష్ణతో పెళ్లి జరిపించడంలో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించారు.

అయితే, శ్రీరామకృష్ణ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో లక్ష్మి ప్రసన్న పుట్టింటి వారికి ఫిర్యాదు చేసింది. దీంతో, ఇరు కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి పరిష్కారం చేసిన ఫలితం లేదు. దీంతో, లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత, తన భర్త అత్తింటి వారిపై లక్ష్మీ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శ్రీరామ కృష్ణకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తనపై లక్ష్మీ ప్రసన్న కేసు పెట్టడం వెనుక వెంకట రామకృష్ణ దంపతులే ఉన్నారని శ్రీరామ కృష్ణ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బావమరిదిని హత్య చేయాలని వేటకొడవలి తీసుకొని సెప్టెంబరు 6న వెంకట రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు. అయితే, ఆ సమయంలో వెంకట రామకృష్ణ తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతిని చంపేందుకు శ్రీరామకృష్ణ నిర్ణయించుకున్నాడు.

ఆమె కేకలు వేస్తూ బయటకు వెళ్ళేందుకు ప్రయత్నించినా వేటాడి వెంటాడి మరీ వేటకొడవలితో కిరాతకంగా ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలని పక్కింటి వారు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ ఆరో తేదీ రాత్రి స్రవంతి మృతి చెందింది. సెప్టెంబరు 7న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

This post was last modified on September 14, 2022 1:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

1 hour ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago