Trends

ఎలాన్ మస్క్ కు కేంద్రం పెద్ద షాక్

దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న స్పేస్ ఎక్స్ ఛైర్మన్ ఎలాన్ మస్క్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. మస్క్ ప్రతిపాదించిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను దేశంలోకి అనుమతించలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఎలాగూ అనుమతులు వచ్చేస్తాయన్న ధీమాతో కొన్ని ప్రాంతాల్లో స్పేస్ ఎక్స్ సంస్ధ కొందరిని ప్రీలాంచ్ చందాదారులగా చేర్చుకున్నదట. వీళ్ళ దగ్గరనుండి వేలాది రూపాయలు వసూలు కూడా చేసేసింది.

కేంద్రం అనుమతివ్వటమే ఆలస్యం దేశమంతా ఒకేసారి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వటానికి మస్క్ భారీ ప్రణాళికలతో ఎప్పటినుండో రెడీగా ఉన్నారు. అయితే మనదేశంలో బిజినెస్ చేసుకోవాలని కోరికతో ఉన్న మస్క్ ఏకంగా కేంద్రానికే కొన్ని షరతులు పెట్టారట. వ్యాపారం చేసుకోవాలని అనుకునేవారు ఎవరూ ఎదుటివారికి షరతులు పెట్టరు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకుని వ్యాపారం ప్రారంభించుకుంటారు. జనాల్లో బాగా పాతుకుపోయిన తర్వాత తమిష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చుకుంటారు.

కానీ మస్క్ మాత్రం కేంద్రానికి నిబంధనలు పెట్టారట. ఇదే సమయంలో అమెరికాకే చెందిన మరో శాటిలైట్ ఇంటర్నెట్ అందించే సంస్ధ హ్యూస్ కమ్యూనికేషన్స్ కేంద్రాన్ని అప్రోచ్ అయ్యిందట. కేంద్రంతో మాట్లాడుకుని దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు అవసరమైన అన్ని అనుమతులను తెచ్చేసుకుంది. హ్యూస్ సేవలు మొదలైతే మహా నగరాలు, నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేయటం ఖాయం.

ఎందుకంటే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కేబుల్స్ అవసరం ఉండదు. కాకపోతే మొదట్లో కనెక్షన్ ఖరీదు ఎక్కువుండచ్చంతే. కేబుల్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ సేవలకన్నా శాటిలైట్ ద్వారా అందే ఇంటర్నెట్ సేవల్లో నాణ్యత చాలా ఎక్కువ. ఇదే సమయంలో ఎలాంటి అంతరాయాలు లేని సేవలను వినియోగదారులు అందుకుంటారు. ఇండియాలో తన సేవలను అందించేందుకు హ్యూస్ ఇస్రోతో ఒప్పందం కూడా చేసుకున్నది. లాంఛనాలు పూర్తిచేసి వీలైనంత తొందరలోనే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు హ్యూస్ కమ్యూనికేషన్ రెడీ అయిపోతోంది. దీంతో మస్క్ కు పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది.

This post was last modified on September 14, 2022 11:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago