వివాహాలు.. అనేవి.. దేవుడు నిర్ణయిస్తాడని అంటారు కదా! మరి.. ఇప్పుడు జరిగిన ఈ వివాహం కూడా ఆ దేవుడే నిర్దేశించాడా? ఇదీ.. ఇప్పుడు ఈ ఘటన గురించి చదివిన తర్వాత.. మనకు మెదిలే ప్రశ్న. ఎందుకంటే.. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు ఫ్యాషన్, కామన్ అయిపోయింది. కానీ, ఇప్పుడు ఈ ఘటనలో ఇద్దరు మహిళలు పెళ్లిచేసుకున్నారు. అది కూడా ఇరు కుటుంబాలను ఒప్పించి.. అందునా.. అత్యంత సంప్రదాయ బద్ధంగా.. భూదేవంత అరుగువేసి.. ఆకాశమంత పందిరి వేసి..! దీంతో ఈ వివాహ వేడుక.. దేశవ్యాప్తంగా.. సంచలనంగా మారింది.
పెద్దవారిని ఒప్పించి మరీ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుభిక్షా సుబ్రమణ్యం(29) అనే మహిళ తమిళనాడులో జన్మించింది. 19 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం కెనడాలోని కాల్గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తోంది. సుభిక్షా కొన్ని రోజులు ఖతార్లో ఉంది. అనంతరం కెనడా వెళ్లి.. తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తల్లికి చెప్పింది. అదే నయం అవుతుందని తల్లి ఓదార్చింది.
బంగ్లాదేశ్కు చెందిన టీనా దాస్ హిందూ కుటుంబంలో జన్మించింది. పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్) అని గ్రహించి భర్తను వదిలేసింది. టీనా కూడా కాల్గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఓ మొబైల్ యాప్ ద్వారా సుభిక్షా, టీనా స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఇళ్లలో ఈ పెళ్లి గురించి ప్రస్తావించారు. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని నెలల తర్వాత పెళ్లికి అంగీకరించారు. దాంతో ఇద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అది కూడా అత్యంత సంప్రదాయ బద్ధంగా కావడం విశేషం.
This post was last modified on September 7, 2022 10:43 am
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…