వివాహాలు.. అనేవి.. దేవుడు నిర్ణయిస్తాడని అంటారు కదా! మరి.. ఇప్పుడు జరిగిన ఈ వివాహం కూడా ఆ దేవుడే నిర్దేశించాడా? ఇదీ.. ఇప్పుడు ఈ ఘటన గురించి చదివిన తర్వాత.. మనకు మెదిలే ప్రశ్న. ఎందుకంటే.. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు ఫ్యాషన్, కామన్ అయిపోయింది. కానీ, ఇప్పుడు ఈ ఘటనలో ఇద్దరు మహిళలు పెళ్లిచేసుకున్నారు. అది కూడా ఇరు కుటుంబాలను ఒప్పించి.. అందునా.. అత్యంత సంప్రదాయ బద్ధంగా.. భూదేవంత అరుగువేసి.. ఆకాశమంత పందిరి వేసి..! దీంతో ఈ వివాహ వేడుక.. దేశవ్యాప్తంగా.. సంచలనంగా మారింది.
పెద్దవారిని ఒప్పించి మరీ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుభిక్షా సుబ్రమణ్యం(29) అనే మహిళ తమిళనాడులో జన్మించింది. 19 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం కెనడాలోని కాల్గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తోంది. సుభిక్షా కొన్ని రోజులు ఖతార్లో ఉంది. అనంతరం కెనడా వెళ్లి.. తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తల్లికి చెప్పింది. అదే నయం అవుతుందని తల్లి ఓదార్చింది.
బంగ్లాదేశ్కు చెందిన టీనా దాస్ హిందూ కుటుంబంలో జన్మించింది. పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్) అని గ్రహించి భర్తను వదిలేసింది. టీనా కూడా కాల్గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఓ మొబైల్ యాప్ ద్వారా సుభిక్షా, టీనా స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఇళ్లలో ఈ పెళ్లి గురించి ప్రస్తావించారు. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని నెలల తర్వాత పెళ్లికి అంగీకరించారు. దాంతో ఇద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అది కూడా అత్యంత సంప్రదాయ బద్ధంగా కావడం విశేషం.
This post was last modified on September 7, 2022 10:43 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…