Trends

విదేశీ మహిళతో తమిళ అమ్మాయి పెళ్లి

వివాహాలు.. అనేవి.. దేవుడు నిర్ణ‌యిస్తాడ‌ని అంటారు క‌దా! మ‌రి.. ఇప్పుడు జ‌రిగిన ఈ వివాహం కూడా ఆ దేవుడే నిర్దేశించాడా? ఇదీ.. ఇప్పుడు ఈ ఘ‌ట‌న గురించి చ‌దివిన త‌ర్వాత‌.. మన‌కు మెదిలే ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇద్ద‌రు యువ‌తులు పెళ్లి చేసుకోవ‌డం.. ఇద్ద‌రు యువ‌కులు పెళ్లి చేసుకోవ‌డం.. ఇప్పుడు ఫ్యాష‌న్‌, కామ‌న్ అయిపోయింది. కానీ, ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు పెళ్లిచేసుకున్నారు. అది కూడా ఇరు కుటుంబాల‌ను ఒప్పించి.. అందునా.. అత్యంత సంప్ర‌దాయ బ‌ద్ధంగా.. భూదేవంత అరుగువేసి.. ఆకాశ‌మంత పందిరి వేసి..! దీంతో ఈ వివాహ వేడుక‌.. దేశ‌వ్యాప్తంగా.. సంచ‌ల‌నంగా మారింది.

పెద్దవారిని ఒప్పించి మరీ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుభిక్షా సుబ్రమణ్యం(29) అనే మహిళ తమిళనాడులో జన్మించింది. 19 ఏళ్లు వచ్చేసరికి ఆమెకు హార్మోన్లలో మార్పు కారణంగా పురుష లక్షణాలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం కెనడాలోని కాల్గెరీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తోంది. సుభిక్షా కొన్ని రోజులు ఖతార్లో ఉంది. అనంతరం కెనడా వెళ్లి.. తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి ఆమె తల్లికి చెప్పింది. అదే నయం అవుతుందని తల్లి ఓదార్చింది.

బంగ్లాదేశ్కు చెందిన టీనా దాస్ హిందూ కుటుంబంలో జన్మించింది. పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత తాను స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్) అని గ్రహించి భర్తను వదిలేసింది. టీనా కూడా కాల్గెరీలోని ఓ ఆస్పత్రిలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఓ మొబైల్ యాప్ ద్వారా సుభిక్షా, టీనా స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఇళ్లలో ఈ పెళ్లి గురించి ప్రస్తావించారు. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని నెలల తర్వాత పెళ్లికి అంగీకరించారు. దాంతో ఇద్దరూ చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అది కూడా అత్యంత సంప్ర‌దాయ బ‌ద్ధంగా కావ‌డం విశేషం.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

32 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago