Trends

చైనాలో అలీబాబా ఆగమాగం.. షాకింగ్ నిర్ణయం

చైనా ప్రభుత్వంతో పెట్టుకొని బతికి బట్టకట్టటం అంత తేలికైన విషయం కాదు. చైనా ఈ-కామర్స్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే అలీబాబాకు కొంత కాలం క్రితం నుంచి బ్యాడ్ టైం షురూ కావటం తెలిసిందే. ప్రభుత్వం కన్నెర్ర చేసిన నేపథ్యంలో అలీబాబా అధినేత జాక్ మాకు కొత్త కష్టాలు పిడుగుల మాదిరి ఒకటి తర్వాత ఒకటి చొప్పున పడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన కంపెనీ మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి.. మరోవైపు అమ్మకాలు తగ్గిపోవటం.. భారీ నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జాక్ మా.. చివరకు తన సంస్థలో పని చేసే పది వేల మంది ఉద్యోగాలకు చెల్లుచీటి ఇచ్చేసిన వైనం సంచలనంగా మారింది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థకు మార్కెట్ లో తీవ్రమైన ఆంక్షలు చైనా ప్రభుత్వం నుంచి రావటంతో జాక్ మాకు తిప్పలు తప్పటం లేదు. అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ లో భాగంగా తాజా చర్యకు కారణమైందంటున్నారు. తమ సంస్థకు చెందిన 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న సమాచారాన్ని అలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వెల్లడించింది.

జూన్ తో ముగిసే త్రైమాసికంలో 9241 మందికి పైనే ఉద్యోగుల్ని తొలగించగా.. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,45,700లకు తగ్గినట్లుగా చెబుతున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితం సంస్థకు చెందిన పలువురు ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. కాస్తంత ఊరడింపు అంశం ఏమంటే.. తమ సంస్థలో ఆరు వేల మంది ఫ్రెష్ వర్సిటీ గ్రాడ్యుయేట్స్ ను పనిలోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో గ్రూపునకు లాభాల్లో కూడా భారీ కోత పడినట్లుగా కంపెనీ చెబుతోంది.

This post was last modified on August 10, 2022 1:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

25 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago