ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చిట్టాపద్దులు అప్పుడే మొదలయిపోయాయి. ఇదే సమయాన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిట్టా పద్దులు అనగా ఐటీ రిటర్న్స్ లెక్క తేలాల్సి ఉంది. ఆఖరికి నిన్నటి వేళ గడువు ముగిసే సమయానికి చాలా ఎక్కువ మందే స్పందించారు. దేశ రాజధానిలో ఆదాయపు పన్ను చెల్లించేందుకు అర్హత ఉన్న వారంతా అనూహ్య స్థాయిలో ఆఖరి ఆదివారం అనగా జూలై 31న స్పందించారు. ఒక్క నిన్నటి రోజునే 68 – 75 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలు అయ్యాయి.
అదేవిధంగా మరో ఐదు లక్షలు అదనంగా ఐటీ రిటర్న్స్ దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గడువు పెంచడంతో ఆరు లక్షల మంది జరిమానాతో సహా చెల్లించేందుకు ఆసక్తి చూపించారన్న వార్తలూ ఉన్నాయి. ఏదేమయినప్పటికీ పన్నుల చెల్లింపు ఈ ఏడాది బాగానే ఉంది. అందుకు తగ్గ అభివృద్ధి, అందుకు తగ్గ విధంగా జీవన ప్రమాణాల మెరుగుదల లేదా పెరుగుదల ఉంటే ఎంతో మేలు.
వాస్తవానికి కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కారణంగానే అధిక ఆదాయం వస్తోంది. అటు జీఎస్టీ కానీ ఇటు ఐటీ కానీ ప్రతి ఏటా మంచి నమోదునే చూపిస్తున్నాయి. సంబంధిత పన్నుల అధికారుల తీరు కూడా బాగానే ఉంటుంది. పన్ను వసూలుకు సంబంధించి గతం కన్నా పారదర్శకత పెరగడంతో అప్పటి కన్నా ఇప్పుడు వేగంగా చెల్లించే అవకాశాలు కూడా పెరగడంతో మాన్యువల్ పేమెంట్స్ కూడా బాగానే తగ్గుతూ వస్తున్నాయి. ఆన్లైన్ ఫైలింగ్ కు మంచి స్పందనే వస్తోంది.
ఆలెక్కన నిన్నటి వేళ దేశ రాజధానిలో ఐటీ రిటర్న్స్ అన్నవి అనూహ్య రీతిలో దాఖలు అయి ఉండవచ్చు. అదేవిధంగా అందుతున్న సమాచారం ప్రకారం అపరాధ రుసుముతో కలిపి కట్టే వారి సంఖ్య కూడా ఈ సారి అనూహ్యంగానే ఉండనుందని తెలుస్తోంది. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు వెయ్యి రూపాయలు, అంతకుమించి ఆదాయం ఉన్న వారు ఐదు వేల రూపాయల చొప్పున ఆదాయపు పన్నుకు సంబంధించి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం మరో కోటి ఐటీ రిటర్న్స్ దాఖలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
This post was last modified on August 1, 2022 8:52 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…