తరచూ వార్తల్లో ఉంటారు ప్రముఖ మీడియా దిగ్గజం రూపక్ మర్దోక్. తన కన్ను పడిన ఏ సంస్థను అయినా తన సొంతం చేసుకోకపోతే ఒక పట్టాన నిద్ర పట్టని ఈ పెద్ద మనిషి వ్యాపారంలోనే కాదు వ్యక్తిగత అంశాల్లోనూ రోటీన్ కు భిన్నంగానే వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన తన నాలుగో భార్యకు విడాకులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. న్యూయార్కు టైమ్స్ కథనం ప్రకారం ప్రముఖ మోడల్ కమ్ నటి జెర్రీ హాల్ ను 2016లో లండన్ లో పెళ్లాడారు మర్దోక్. తాజాగా తన నాలుగో భార్యకు ఆయనకు విడాకులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్దోక్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం చూస్తే.. ఆయన ఆస్తులు సుమారు రూ.1.38 లక్షల కోట్లు. మర్దోక్ తన మొదటి భార్య పాట్రిసియాతో 1966లో విడిపోయారు. ఆమె ఫ్లైట్ అటెండెంట్ గా పని చేసేది. తర్వాత రెండో భార్య అన్నాతో 1999లోవిడిపోయారు. మూడో భార్య వెండీ డెంగ్ తో 2014లో విడిపోయి.. జెర్రీ హాల్ ను 2016లో పెళ్లాడారు. తాజాగా ఆ పెళ్లి సైతం పెటాకులైంది.
ఏమైనా ముదిమి వయసులో తనకు తోడుగా ఉన్న భార్యను వదులుకోవటానికి ఇష్టపడరు. మరి.. మర్దోక్ మాత్రం అందుకు భిన్నంగా నాలుగో భార్యకు విడాకులు ఇచ్చారు. అమెరికా.. యూకే.. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో ప్రముఖ వార్తా సంస్థల్ని సొంతం చేసుకున్న ఈ మీడియా మొఘల్ కు ప్రముఖ మీడియాసంస్థల్లో భారీ వాటాలే ఉన్నాయి. 91 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకుంటారో ఏమిటో చూడాలి.
This post was last modified on June 24, 2022 12:06 pm
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…