తరచూ వార్తల్లో ఉంటారు ప్రముఖ మీడియా దిగ్గజం రూపక్ మర్దోక్. తన కన్ను పడిన ఏ సంస్థను అయినా తన సొంతం చేసుకోకపోతే ఒక పట్టాన నిద్ర పట్టని ఈ పెద్ద మనిషి వ్యాపారంలోనే కాదు వ్యక్తిగత అంశాల్లోనూ రోటీన్ కు భిన్నంగానే వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన తన నాలుగో భార్యకు విడాకులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. న్యూయార్కు టైమ్స్ కథనం ప్రకారం ప్రముఖ మోడల్ కమ్ నటి జెర్రీ హాల్ ను 2016లో లండన్ లో పెళ్లాడారు మర్దోక్. తాజాగా తన నాలుగో భార్యకు ఆయనకు విడాకులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్దోక్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం చూస్తే.. ఆయన ఆస్తులు సుమారు రూ.1.38 లక్షల కోట్లు. మర్దోక్ తన మొదటి భార్య పాట్రిసియాతో 1966లో విడిపోయారు. ఆమె ఫ్లైట్ అటెండెంట్ గా పని చేసేది. తర్వాత రెండో భార్య అన్నాతో 1999లోవిడిపోయారు. మూడో భార్య వెండీ డెంగ్ తో 2014లో విడిపోయి.. జెర్రీ హాల్ ను 2016లో పెళ్లాడారు. తాజాగా ఆ పెళ్లి సైతం పెటాకులైంది.
ఏమైనా ముదిమి వయసులో తనకు తోడుగా ఉన్న భార్యను వదులుకోవటానికి ఇష్టపడరు. మరి.. మర్దోక్ మాత్రం అందుకు భిన్నంగా నాలుగో భార్యకు విడాకులు ఇచ్చారు. అమెరికా.. యూకే.. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో ప్రముఖ వార్తా సంస్థల్ని సొంతం చేసుకున్న ఈ మీడియా మొఘల్ కు ప్రముఖ మీడియాసంస్థల్లో భారీ వాటాలే ఉన్నాయి. 91 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకుంటారో ఏమిటో చూడాలి.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…