Trends

అగ్నిపథ్ కు కార్పొరేట్ల మద్దతు

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి ఒకవైపు అభ్యర్థులు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే, వ్యతిరేకిస్తుంటే మరోవైపు కార్పొరేట్ ప్రపంచం మద్దతిస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని కార్పొరేట్ సంస్ధలు స్వాగతిస్తున్నాయి. అగ్నిపథ్ పథకంలో సైన్యంలోకి ప్రవేశించి, శిక్షణ తీసుకుని నాలుగేళ్ళ సర్వీసు తర్వాత రిటైర్ అయిన వారిని కార్పొరేట్ సంస్ధల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వివిధ సంస్ధల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి.

మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, ఆర్పీజీ గ్రూపు ఛైర్మన్ హర్ష్ గోయెంక, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ లు అగ్నివీరులను తమ కంపెనీల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా తమ కంపెనీల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చో కూడా వీరు వివరించటం కేంద్ర ప్రభుత్వానికి నైతిక మద్దతుగా నిలిచేదే.

సుశిక్షితులైన, సమర్ధులైన యువత కంపెనీల్లో ఉద్యోగాలకు చాలా అవసరమని వీళ్ళు చెప్పారు. అగ్నిపథ్ పథకం ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కార్పొరేట్లకు ఒకేసారి రావడం చాలా అరుదుగా జరుగుతుందని ఆనంద్ మహీంద్ర అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ, సుశిక్షితులైన యువత కార్పొరేట్ ప్రపంచానికి చాలా అవసరంగా హర్ష్ గోయెంకా చెప్పారు. అపోలో హాస్పిటల్స్, టీవీఎస్ మోటార్స్, టాటా గ్రూప్ లాంటి అనేక కార్పొరేట్ కంపెనీలు కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే సమాజంలో స్పష్టమైన విభజన జరగబోతున్నట్లు అనుమానంగా ఉంది. కేంద్రం తన నిర్ణయానికి మద్దతుగా కార్పొరేట్ కంపెనీలను రంగం మీదకు తెచ్చినట్లే అనుమానంగా ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు, అభ్యర్థులు, రక్షణదళంలో పనిచేసి రిటైర్ అయిన వారిలో కొందరు అగ్ని పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్ని వీరులకు ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు కేంద్రం చెబుతోంది. అయితే దేశంలో పోయిన సంవత్సరం జూన్ నాటికి 27 లక్షలమంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. అయితే వీరి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య చాలా తక్కువ. అలాగే బ్యాంకుల్లో రుణాలూ రాలేదు. ఇలాంటి అనేక కారణాల వల్లే ప్రతిపక్షాలు ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

This post was last modified on June 21, 2022 12:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

43 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

1 hour ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago