దశాబ్దాల పాటు ప్రపంచ ప్రజల్ని వణికించిన హెచ్ ఐవీ – ఎయిడ్స్ మహమ్మారి పీచమణిచే రోజులు దగ్గరకు వచ్చేసినట్లే. కొన్నేళ్ల పాటు ఈ వ్యాధికి చికిత్స ఏమీ లేని పరిస్థితుల్లో వేలాది మంది కన్నుమూయటం తెలిసిందే. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారిని రక్షించేందుకు వీలుగా శాస్త్ర అద్భుతాన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. చికిత్స లేని హెచ్ ఐవీ ఎయిడ్స్ ను కట్టడి చేసేందుకు వీలుగా ఇంజెక్షన్ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.
ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలకు దక్కుతుందని చెప్పాలి. జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించిన ఇప్పటివరకు కొరుకుడుపడని ఈ వ్యాధికి చెక్ చెప్పే వ్యాక్సిన్ ను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పరిశోధన ఫలితాల్ని తాజాగా వెల్లడించింది నేచర్ జర్నల్. ఈ వ్యాక్సిన్ ను తీసుకున్న వారి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్లుగా ఈ జర్నల్ పేర్కొంది.
ఒక డోసు వ్యాక్సిన్ తో హెచ్ ఐవీ రోగుల్లో వైరస్ తటస్థీకరించేలా చేయటంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. తొలి దశలో సాధించిన ఈ విజయం నేపథ్యంలో.. అతి త్వరలోనూ పూర్తిస్థాయి చెక్ పెట్టేలా ఇంజెక్షన్ సిద్ధం కావొచ్చని చెబుతున్నారు. టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన న్యూరో బయాలజీ.. బయో కెమిస్ట్రీ.. బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల టీం నిర్వహించిన పలు పరిశోధనల అనంతరం ఈ వ్యాక్సిన్ ను సిద్ధం చేశారు.
సాధారణంగా మనిషి శరీరంలోని వైరస్.. బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్ ఉండాలి. అవి వైరస్ తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా వైరస్ మార్పులపైనా పోరాడి వాటిని నిర్వీర్యం చేస్తాయి. తాజా వ్యాక్సిన్ ప్రయోగం.. ఎయిడ్స్ మీద సాగుతున్న సుదీర్ఘ పోరులో పెద్ద ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రయోగం అందించిన విజయంతో త్వరలోనే ఎయిడ్స్ కు పక్కా ఔషధాన్ని తయారు చేసే రోజు దగ్గర్లోకి వచ్చేసినట్లుగా చెబుతున్నారు.
This post was last modified on June 16, 2022 4:36 pm
రేపు విడుదల కాబోతున్న డెకాయిట్ మీద ట్రేడ్ వర్గాలే కాదు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుక్ మై…
పైకి అంతా బాగుందని చెప్పడానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషించడానికి చాలా తేడా ఉంటుంది. పైకి మెచ్చుకోళ్లకు, మెప్పులకు…
మన శంకరవరప్రసాద్ గారుతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయకుండా వేగానికి ప్రాధాన్యం ఇస్తూనే క్వాలిటీ మిస్ కాకుండా చూసుకోవడంలో మలయాళ…
టీడీపీకి కార్యకర్తలే వెన్నెముకని.. తరచుగా పార్టీఅధినేత సీఎం చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ పార్టీ జాతీయ ప్రధాన…
ప్రస్తుతం టాలీవుడ్లో ప్రామిసింగ్ యంగ్ యాక్టర్లలో అడివి శేష్ ఒకడు. తనకంటూ హీరోగా ఒక స్థాయి ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్,…