దశాబ్దాల పాటు ప్రపంచ ప్రజల్ని వణికించిన హెచ్ ఐవీ – ఎయిడ్స్ మహమ్మారి పీచమణిచే రోజులు దగ్గరకు వచ్చేసినట్లే. కొన్నేళ్ల పాటు ఈ వ్యాధికి చికిత్స ఏమీ లేని పరిస్థితుల్లో వేలాది మంది కన్నుమూయటం తెలిసిందే. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారిని రక్షించేందుకు వీలుగా శాస్త్ర అద్భుతాన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. చికిత్స లేని హెచ్ ఐవీ ఎయిడ్స్ ను కట్టడి చేసేందుకు వీలుగా ఇంజెక్షన్ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.
ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలకు దక్కుతుందని చెప్పాలి. జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించిన ఇప్పటివరకు కొరుకుడుపడని ఈ వ్యాధికి చెక్ చెప్పే వ్యాక్సిన్ ను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పరిశోధన ఫలితాల్ని తాజాగా వెల్లడించింది నేచర్ జర్నల్. ఈ వ్యాక్సిన్ ను తీసుకున్న వారి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్లుగా ఈ జర్నల్ పేర్కొంది.
ఒక డోసు వ్యాక్సిన్ తో హెచ్ ఐవీ రోగుల్లో వైరస్ తటస్థీకరించేలా చేయటంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. తొలి దశలో సాధించిన ఈ విజయం నేపథ్యంలో.. అతి త్వరలోనూ పూర్తిస్థాయి చెక్ పెట్టేలా ఇంజెక్షన్ సిద్ధం కావొచ్చని చెబుతున్నారు. టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన న్యూరో బయాలజీ.. బయో కెమిస్ట్రీ.. బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల టీం నిర్వహించిన పలు పరిశోధనల అనంతరం ఈ వ్యాక్సిన్ ను సిద్ధం చేశారు.
సాధారణంగా మనిషి శరీరంలోని వైరస్.. బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్ ఉండాలి. అవి వైరస్ తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా వైరస్ మార్పులపైనా పోరాడి వాటిని నిర్వీర్యం చేస్తాయి. తాజా వ్యాక్సిన్ ప్రయోగం.. ఎయిడ్స్ మీద సాగుతున్న సుదీర్ఘ పోరులో పెద్ద ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రయోగం అందించిన విజయంతో త్వరలోనే ఎయిడ్స్ కు పక్కా ఔషధాన్ని తయారు చేసే రోజు దగ్గర్లోకి వచ్చేసినట్లుగా చెబుతున్నారు.
This post was last modified on June 16, 2022 4:36 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…