దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని క్షేత్ర స్ధాయిలోని పరిణామాలు చూస్తుంటే కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ ఆందోళన పెరిగిపోతోంది. దేశం మొత్తం మీద శనివారం 3962 కేసులు నమోదైతే, ఆదివారం నాడు 4270 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదవ్వటమే కాకుండా 15 మంది చనిపోయారు. మార్చి 11వ తేదీ తర్వాత ఇన్ని వేల కేసులు నమోదవ్వటం మళ్ళీ ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, దేశ రాజధాని అయిన ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.
పై రాష్ట్రాలతో పాటు కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అందుకనే కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకించి అలర్ట్ ప్రకటించారు. పై రాష్ట్రాల్లో జనాలందరు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో నమోదైన మొత్తం 4270 కేసుల్లో 1357 కేసులు మహారాష్ట్రలో మాత్రమే నమోదవ్వడం ఆ తీవ్రతకు ఉదాహరణగా మారింది. మొదటి నుంచి మహారాష్ట్ర ప్రత్యేకించి ముంబైలోనే కరోనా వైరస్ కేసులు మొదటి నుంచి విపరీతంగా నమోదవుతున్నాయి.
ముంబైలోని ధారవి స్లమ్ కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నాయి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ (స్లమ్) ధారావీయే. ఇందులో సుమారు 20 లక్షల మంది నివాసముంటున్నారు. కాబట్టి ఏ అంటు వ్యాధి సోకినా రోజుల వ్యవధిలో మొత్తం స్లమ్ అంతా పాకిపోతుంది. ఇందుకనే ముంబైలో కేసులు మొదటి నుండి చాలా ఎక్కువగా నమోదవుతోందనే ప్రచారముంది.
ఫోర్త్ వేవ్ జూన్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 24 మధ్య పోర్త్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. వైరస్ నియంత్రణకు భౌతిక దూరం పాటించటం, ప్రతి ఒక్కళ్ళు మాస్కు ధరించటమే ఏకైక మార్గమని నిపుణులు జనాలను హెచ్చరిస్తున్నారు. ఇపుడు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల్లో కొత్త వేరియంట్లలో జాడ కనిపించటం లేదని శాస్త్రజ్ఞులు ప్రకటించటం కాస్త ఊరట కలిగించేదే. కాకపోతే పాత వేరియంట్లే తీవ్ర స్ధాయిలో విజృంభిస్తే మాత్రం నష్టాలు భారీగా ఉంటాయని అంటున్నారు.
This post was last modified on June 6, 2022 11:10 am
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…