ఈ ఫోటోకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులోని మహిళల్ని చూసినంతనే క్రికెట్ ప్రేమికులు ఎక్కడో చూసినట్లుందే అనుకోవటం ఖాయం. అవును.. ఈ ఇద్దరు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు. స్టార్ మహిళా క్రికెటర్లుగా పేరున్న కేథరీన్ బ్రట్.. నటాలీ స్కివర్ లు తమ రోటీన్ డ్రెస్ కు భిన్నంగా.. ఇంత అందంగా ముస్తాబు కావడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది. గతంలో ప్రేమన్నా.. పెళ్లి అన్నా అమ్మాయి.. అబ్బాయి మధ్యన సాగేది.
కొంతకాలంగా వచ్చిన మార్పుతో అబ్బాయి.. అబ్బాయిని.. అమ్మాయి.. అమ్మాయిని ప్రేమించుకోవటం.. పెళ్లి చేసుకోవటం తెలిసిందే.
ఈ ఇద్దరు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు సైతం గడిచిన ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం కోసం వారిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వీకెండ్ లో పెళ్లి చేసుకున్న కేథరీన్ బ్రంట్.. నాట్ స్కివర్ లకు తమ హృదయపూర్వక అభినందనలంటూ ఇంగ్లండ్ జట్టు తెలిపింది. గ్రాండ్ గా సాగిన వీరి వివాహ వేడుకకు పలువురు ఇంగ్లండ్ క్రికెట్ ఆటగాళ్లు.. మాజీలు హాజరయ్యారు. 2017లో ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రపంచ కప్ గెలుచుకోవటం తెలిసిందే. ఈ విజయంతో ఈ ఇద్దరు మహిళా క్రికెటర్లు కీలకంగా వ్యవహరించారు.
ప్రపంచ క్రికెట్ లో ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకొని ఒక్కటి కావటం ఇదేమీ తొలిసారిగా కాదని చెబుతున్నారు. గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సటర్త్ వైట్.. లియా.. దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్లు మా రిజాన్ కాప్.. డేన్ వాన్ లు కూడా పెళ్లి బంధంతో ఒక్కటైన ఉదంతాలు ఉన్నాయి. అమ్మాయిల్ని అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం బాగానే ఉన్నా.. అబ్బాయిల్ని అబ్బాయిలు పెళ్లాడిన ఉదంతాలు మాత్రం లేవంటున్నారు.
This post was last modified on May 31, 2022 10:45 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…