Trends

ఫిక్సయిపోయారు.. ఐపీఎల్ ఫైనల్ ఫిక్సింగ్ అని

ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అని ఓ వర్గం క్రికెట్ అభిమానులు బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక పాయింట్ పట్టుకుని మ్యాచ్ ఫిక్సయిందని ఆరోపణలు చేస్తుంటారు. ఐతే ఈ ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యానాలు ఎప్పుడూ ఉండేవే కావట్టి అందరూ లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఐపీఎల్‌లో చివరి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఢిల్లీ ఓడిపోవడాన్ని చాలామంది అనుమానంగా చూశారు.

బెంగళూరును ఫైనల్ చేర్చడానికి ఢిల్లీ కావాలనే ఓడిపోయిందని, ఇదంతా ఫిక్సింగ్ అని సోషల్ మీడియాలో ఓ వర్గం అదే పనిగా ఆరోపించింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఫైనల్ విషయంలో ఇంకా పెద్ద స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. గుజరాత్ టైటిల్ గెలవడం ముందే ఫిక్స్ అయిపోయిందని.. ఊరికే మ్యాచ్ పేరుతో డ్రామా నడిచిందని ట్విట్టర్లో నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ‘ఫిక్సింగ్’ అనే పదం ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.

గుజరాత్ టైటాన్స్.. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీం అని, ఫైనల్ జరిగింది నరేంద్ర మోడీ పేరుతో ఉన్న స్టేడియంలో అని, హోం మంత్రి అమిత్ షా, ఆయన తనయుడైన బీసీసీఐ కార్యదర్శి జై షా సహా పలువురు బీజేపీ నేతలు ఈ మ్యాచ్‌కు అతిథులుగా హాజరవడం.. ఇదంతా చూపించి గుజరాతే టైటిల్ విజేత అంటూ మ్యాచ్ ఆరంభానికి ముందే ప్రచారం మొదలైంది.

ఈ ఐపీఎల్‌లో మొదట్నుంచి టాస్ గెలిచిన జట్టు బౌలింగే ఎంచుకుంటుండగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు సాధించగా.. రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం, ఆ తర్వాత మరీ నెమ్మదిగా ఆడి తక్కువ స్కోరుకు పరిమితం కావడం.. తర్వాత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ క్యాచ్‌ను తొలి ఓవర్లోనే చాహల్ వదిలేయడం.. లాంటి ఉదంతాలను చూపించి.. రాజస్థాన్ కావాలనే ఓడిపోయిందని.. గుజరాత్‌‌కు కప్పు అందించడానికే ఇదంతా అని.. మ్యాచ్ పూర్తిగా ఫిక్సింగే అని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఐతే ఈ సీజన్లో మొదట్నుంచి గుజరాత్ అదరగొడుతున్న వైనం చూశాక టైటిల్ విజయానికి అది అర్హమమైన జట్టే అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

3 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

5 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

5 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

7 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

10 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

11 hours ago