Trends

పతంజలి మందు.. కరోనాను 14 రోజుల్లో తరిమేస్తుందట

కరోనా వైరస్‌ను కట్టడి చేసే మందు కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను పూర్తిగా తగ్గించేసే మందంటూ ఇప్పటిదాకా ఏదీ రాలేదు. ఇటీవలే గ్లెన్ మార్క్ సంస్థ.. ‘ఫాబి ఫ్లూ’ పేరుతో ఒక మందును ప్రవేశపెట్టింది. కరోనా తక్కువ, మధ్యస్థ స్థాయిలో ఉన్న వారికి ఈ మందు పని చేస్తుందని.. అది కూడా డోస్ ఎక్కువ ఉండాలని.. వైద్యుల సూచన మేరకే ఈ మందు వేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.

మరోవైపు సిప్లాతో పాటు మరో సంస్థ కూడా కరోనాను నియంత్రించే మందులు తీసుకొచ్చాయి. ఐతే వీటి ప్రామాణికతపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. కరోనాకు కచ్చితమైన మందంటూ ఇంకా రాలేదన్నది స్పష్టం. ఐతే ఇప్పుడు కరోనాను పూర్తిగా తగ్గించేసే ఆయుర్వేద మందును తయారు చేసినట్లు పతంజలి సంస్థ ప్రకటించడం విశేషం.

తాము కరోనాకు మందు తయారు చేస్తున్నట్లు ఇంతకుముందే పతంజలి సంస్థ ప్రకటించింది. ఇప్పుడు అన్నట్లుగానే మందును మార్కెట్లోకి తెచ్చింది. దీని గురించి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ మందు పేరు ‘కోరోనిల్’ అట. ఇవి మాత్రల రూపంలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా రెండు వారాల పాటు వాడితే కరోనాను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని రామ్‌దేవ్ బాబు పేర్కొన్నారు.

ఈ మందు తయారీ కోసం150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు.

క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని.. ఇప్పటికే తమ మందు వాడిన రోగులు అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు. మరి ఈ మందు విషయంలో కస్టమర్ రివ్యూలు ఎలా ఉంటాయో చూడాలి.

This post was last modified on June 23, 2020 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

22 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago