కరోనా వైరస్ను కట్టడి చేసే మందు కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ను పూర్తిగా తగ్గించేసే మందంటూ ఇప్పటిదాకా ఏదీ రాలేదు. ఇటీవలే గ్లెన్ మార్క్ సంస్థ.. ‘ఫాబి ఫ్లూ’ పేరుతో ఒక మందును ప్రవేశపెట్టింది. కరోనా తక్కువ, మధ్యస్థ స్థాయిలో ఉన్న వారికి ఈ మందు పని చేస్తుందని.. అది కూడా డోస్ ఎక్కువ ఉండాలని.. వైద్యుల సూచన మేరకే ఈ మందు వేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.
మరోవైపు సిప్లాతో పాటు మరో సంస్థ కూడా కరోనాను నియంత్రించే మందులు తీసుకొచ్చాయి. ఐతే వీటి ప్రామాణికతపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. కరోనాకు కచ్చితమైన మందంటూ ఇంకా రాలేదన్నది స్పష్టం. ఐతే ఇప్పుడు కరోనాను పూర్తిగా తగ్గించేసే ఆయుర్వేద మందును తయారు చేసినట్లు పతంజలి సంస్థ ప్రకటించడం విశేషం.
తాము కరోనాకు మందు తయారు చేస్తున్నట్లు ఇంతకుముందే పతంజలి సంస్థ ప్రకటించింది. ఇప్పుడు అన్నట్లుగానే మందును మార్కెట్లోకి తెచ్చింది. దీని గురించి సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ మందు పేరు ‘కోరోనిల్’ అట. ఇవి మాత్రల రూపంలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా రెండు వారాల పాటు వాడితే కరోనాను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని రామ్దేవ్ బాబు పేర్కొన్నారు.
ఈ మందు తయారీ కోసం150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు.
క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని.. ఇప్పటికే తమ మందు వాడిన రోగులు అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు. మరి ఈ మందు విషయంలో కస్టమర్ రివ్యూలు ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on June 23, 2020 10:36 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…