కరోనా వైరస్ను కట్టడి చేసే మందు కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ను పూర్తిగా తగ్గించేసే మందంటూ ఇప్పటిదాకా ఏదీ రాలేదు. ఇటీవలే గ్లెన్ మార్క్ సంస్థ.. ‘ఫాబి ఫ్లూ’ పేరుతో ఒక మందును ప్రవేశపెట్టింది. కరోనా తక్కువ, మధ్యస్థ స్థాయిలో ఉన్న వారికి ఈ మందు పని చేస్తుందని.. అది కూడా డోస్ ఎక్కువ ఉండాలని.. వైద్యుల సూచన మేరకే ఈ మందు వేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.
మరోవైపు సిప్లాతో పాటు మరో సంస్థ కూడా కరోనాను నియంత్రించే మందులు తీసుకొచ్చాయి. ఐతే వీటి ప్రామాణికతపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. కరోనాకు కచ్చితమైన మందంటూ ఇంకా రాలేదన్నది స్పష్టం. ఐతే ఇప్పుడు కరోనాను పూర్తిగా తగ్గించేసే ఆయుర్వేద మందును తయారు చేసినట్లు పతంజలి సంస్థ ప్రకటించడం విశేషం.
తాము కరోనాకు మందు తయారు చేస్తున్నట్లు ఇంతకుముందే పతంజలి సంస్థ ప్రకటించింది. ఇప్పుడు అన్నట్లుగానే మందును మార్కెట్లోకి తెచ్చింది. దీని గురించి సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ మందు పేరు ‘కోరోనిల్’ అట. ఇవి మాత్రల రూపంలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా రెండు వారాల పాటు వాడితే కరోనాను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని రామ్దేవ్ బాబు పేర్కొన్నారు.
ఈ మందు తయారీ కోసం150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు.
క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని.. ఇప్పటికే తమ మందు వాడిన రోగులు అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు. మరి ఈ మందు విషయంలో కస్టమర్ రివ్యూలు ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on June 23, 2020 10:36 pm
గత ఏడాది మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో కలంకవల్ సినిమా ఒక సంచలనం. కలెక్షన్ల పరంగా చూస్తే అదేమీ బ్లాక్ బస్టర్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ పాత పాటే పాడారు. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యానించారు.…
ఐపీఎల్ 2026 సీజన్లో అసలైన మజాను పంచిన మ్యాచ్గా గుజరాత్ టైటాన్స్ (GT), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పోరు నిలిచిపోతుందని…
రాకా.. ఈ రోజు సోషల్ మీడియాను ఊపేస్తున్న పేరు. ఎక్స్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పేరు టాప్లో…
రష్యా అమ్మాయి అయిన అనా కొణిదల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకోవడం.. మెగా కుటుంబంలో సులువుగా కలిసిపోవడం..…
‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి…