Trends

ఏపీలో విద్యుత్ చార్జీల బాదుడు

ఏపీలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సంప‌న్న వ‌ర్గాల‌కు ఇస్తున్న విద్యుత్ యూనిట్ కు 55 పైస‌లు పెర‌గ్గా.. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై మాత్రం భారీ ఎత్తున బాదేశారు. అయితే.. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి. సున్నా నుండి 30 యూనిట్ల వరకు గత ధర రూ.1.45 పైసలు ఉండ‌గా.. మండలి ఆమోదించిన ధర రూ.1.90పైసలుగా ఉంది. దీంతో పెంపు 45 పైసలైంది.  

31 నుంచి 75 యూనిట్ల వరకు రూ.2.09 పైసల నుండి రూ.3.00 పెంపుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ టారిఫ్‌లో ఉన్న వినియోగ‌దారులు.. 91 పైసల భారం ప‌డ‌నుంది. ఇక‌, 76 యూనిట్ల‌ నుంచి 125 యూనిట్ల వరకు రూ.3.10 నుండి రూ.4.50లకు పెంపున‌కు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్కు 1.40 పైసలు చొప్పున పెరిగింది.

అదేవిధంగా 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.4.43 నుండి రూ.6.00 పెంపుకు మండలి ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్‌కు రూ.1.57 పైసలు చొప్పున భారం ప‌డింది. ఇక‌, 226  నుంచి 400 యూనిట్ల వరకు రూ.7.59 నుండి రూ.8.75 వరకు పెంపుకు ఆమోదం తెలిపారు. ఫ‌లితంగా యూనిట్ రూ. 1.16 పైసలు, చొప్పున పెర‌గ నుంది.

అదేస‌మ‌యంలో 400 యూనిట్ల పైన రూ.9.20 నుండి రూ.9.75కు పెంపుకు ఆమోదం తెలప‌గా.. యూనిట్ విద్యుత్ పై 55 పైసల చొప్పున భారం ప‌డింది. ఫ‌లితంగా పేద , మధ్య తరగతి ప్రజలకు అదనపు భారం మొప‌గా.. సంపన్నులకు కేవలం పెంచినది 55 పైసలు కావ‌డం గ‌మ‌నార్హం. పేదలకు ఆదాయం పెరుగకపోగా అదనపు భారం పెంపుపై  పేద , మధ్యతరగతి ప్రజలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు ఇలా పెరిగాయి..
30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు
31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు
126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు
226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు
400 యూనిట్ల పైన యూనిట్‌కు 55 పైసలు పెంపు

This post was last modified on March 30, 2022 5:41 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

49 mins ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

2 hours ago

అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి

ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…

3 hours ago

మా మామ నీచుడు-నికృష్టుడు: అంబ‌టి అల్లుడు

ఏపీలో రాజ‌కీయాలు ఊపందుకున్న నేప‌థ్యంలో సంచ‌ల‌నాలు కూడా అదే రేంజ్‌లో తెర‌మీదికి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌ధాన పార్టీల‌న్నీ కూడా.. పెద్ద…

3 hours ago

నోటి ‘దురుసు’ తీరుస్తుందా ?!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…

4 hours ago

అన‌కాప‌ల్లిలో సీఎం ర‌మేష్‌పై వైసీపీ నేత‌ల దాడి.. గాయాలు!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ కార్య‌క‌ర్త ల మ‌ధ్య…

5 hours ago