Trends

ఏపీలో విద్యుత్ చార్జీల బాదుడు

ఏపీలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సంప‌న్న వ‌ర్గాల‌కు ఇస్తున్న విద్యుత్ యూనిట్ కు 55 పైస‌లు పెర‌గ్గా.. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై మాత్రం భారీ ఎత్తున బాదేశారు. అయితే.. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి. సున్నా నుండి 30 యూనిట్ల వరకు గత ధర రూ.1.45 పైసలు ఉండ‌గా.. మండలి ఆమోదించిన ధర రూ.1.90పైసలుగా ఉంది. దీంతో పెంపు 45 పైసలైంది.  

31 నుంచి 75 యూనిట్ల వరకు రూ.2.09 పైసల నుండి రూ.3.00 పెంపుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ టారిఫ్‌లో ఉన్న వినియోగ‌దారులు.. 91 పైసల భారం ప‌డ‌నుంది. ఇక‌, 76 యూనిట్ల‌ నుంచి 125 యూనిట్ల వరకు రూ.3.10 నుండి రూ.4.50లకు పెంపున‌కు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్కు 1.40 పైసలు చొప్పున పెరిగింది.

అదేవిధంగా 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.4.43 నుండి రూ.6.00 పెంపుకు మండలి ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్‌కు రూ.1.57 పైసలు చొప్పున భారం ప‌డింది. ఇక‌, 226  నుంచి 400 యూనిట్ల వరకు రూ.7.59 నుండి రూ.8.75 వరకు పెంపుకు ఆమోదం తెలిపారు. ఫ‌లితంగా యూనిట్ రూ. 1.16 పైసలు, చొప్పున పెర‌గ నుంది.

అదేస‌మ‌యంలో 400 యూనిట్ల పైన రూ.9.20 నుండి రూ.9.75కు పెంపుకు ఆమోదం తెలప‌గా.. యూనిట్ విద్యుత్ పై 55 పైసల చొప్పున భారం ప‌డింది. ఫ‌లితంగా పేద , మధ్య తరగతి ప్రజలకు అదనపు భారం మొప‌గా.. సంపన్నులకు కేవలం పెంచినది 55 పైసలు కావ‌డం గ‌మ‌నార్హం. పేదలకు ఆదాయం పెరుగకపోగా అదనపు భారం పెంపుపై  పేద , మధ్యతరగతి ప్రజలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు ఇలా పెరిగాయి..
30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు
31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు
126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు
226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు
400 యూనిట్ల పైన యూనిట్‌కు 55 పైసలు పెంపు

This post was last modified on March 30, 2022 5:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

56 minutes ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

4 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

6 hours ago