రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.
అంతకుముందు జరిగిన కొన్ని ముఖాముఖి చర్చలు విఫలమైన నేపథ్యంలో శాంతి చర్చలపై ఉక్రెయిన్కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. ఇస్తాంబుల్ చర్చల తర్వాత.. పుతిన్, జెలెన్స్కీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు, ఉక్రెయిన్ భద్రత వంటి అంశాలే లక్ష్యంగా ఇస్తాంబుల్లో చర్చలు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వివరించారు.
ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు ఫలప్రదంగా సాగడం వల్ల చమురు సరఫరాపై ఉన్న భయాలు వీడాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 5శాతానికిపైగా తగ్గింది. మరోవైపు రష్యా కరెన్సీ రూబెల్ విలువ 10శాతం మేర పెరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న చమురు సంక్షోభాన్ని తగ్గిస్తుందని.. పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. నిత్యవస ర సరుకుల ధరలతో పాటు.. యుద్ధం కారణంగా.. పలు దేశాల్లో ఏర్పడిన ఆర్తిక సంక్షోభం కూడా తగ్గుముఖం పడుతుందని.. అంటున్నారు. కాగా, దాదాపు నెల రోజులుగా సాగుతున్న యుద్దంలో ఇప్పటి వరకు వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా.. ఇరు దేశాల సైనికులు కూడా ప్రాణత్యాగం చేశారు.
పలు దఫాలు చర్చలు సాగినా.. ఇప్పటి వరకు ఇరు దేశాలు బెట్టు వీడలేదు. అయితే.. రష్యా పరిస్థితి దయనీయంగా మారడం.. ప్రపంచ దేశాల నుంచి ఆంక్షలు పెరుగుతుండడంతో.. రష్యా ఒకింత దిగివచ్చినట్టు తెలుస్తోంది. ఇక, ఉక్రెయిన్ కూడా కొన్ని షరతులకు అంగీకారం తెలిపింది. నాటో కూటమిలో చేరేది లేదని.. ఇప్పటికే అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఈ పరిణామాలతో తాజాగా జరిగిన చర్చలు ఫలించాయి. త్వరలోనే యుద్ధమేఘాలు వీడిపోయి.. ఇరు దేశాలు ఒప్పందాలపై దృష్టి పెట్టనున్నాయని తెలుస్తోంది.
This post was last modified on March 29, 2022 9:32 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…