Trends

రిలయన్స్ జియోకు సీఐఎస్ఎఫ్ భద్రత?

వినటానికి విచిత్రంగానే ఉంది. మామూలుగా ప్రజల ఆస్తులకు అంటే ప్రభుత్వ ఆస్తుల రక్షణకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించటం ఇప్పటివరకు మనం వినుంటాము. ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులు, రైల్వేస్టేషన్లు లేదా ఇంకేవైనా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు తదితరాలకు ప్రభుత్వ భద్రత కల్పించటం సహజమే. కానీ ఒక ప్రైవేటు వ్యాపార సంస్ధకు ప్రభుత్వానికి చెందిన భద్రతా దళాలను ఉపయోగించటం బహుశా ఇదే మొదటిసారేమో.

ముఖేష్ అంబానీకి చెందిన ముంబయ్ లోని రిలయన్స్ జియో వరల్డ్ సెంటర్ కు సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దళాలతో భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వాణిజ్య వినోద కేంద్రానికి 200 మంది సీఐఎస్ఎఫ్ దళాలతో సెక్యూరిటీ ఇచ్చేందుకు కేంద్రం డిసైడ్ చేసింది. ఉగ్రవాద, విధ్వంసకర శక్తుల నుండి జియో సెంటర్ కు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం అందించాయి. దాని నివేదిక ప్రకారం జియో సెంటర్ కు ప్రత్యేకమైన సెక్యూరిటీని కల్పించింది. 

మామూలుగా ప్రైవేటు సంస్థలకు ఏదైనా సెక్యూరిటీ సమస్యలుంటే అవే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకుంటాయి. అంతేకానీ ఇలాగ సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలను ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం కేటాయించటం బహుశా ఇదే మొదలు. ఇదే పద్దతిలో మిగిలిన కార్పొరేట్ సంస్ధల యాజమాన్యాలు కూడా సీఐఎస్ఎఫ్ భద్రతా దళాల రక్షణ కావాలని డిమాండ్లు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది ?

ఒకవైపేమో వీవీఐపీలకు సీఐఎస్ఎప్ సెక్యూరిటీని తగ్గించేస్తు మరోవైపు కార్పొరేట్ సంస్ధయిన జియోకు కేటాయించటం వివాదాస్పదమవుతోంది. ముంబయ్ లోని ముఖేష్ కు చెందిన  యాంటిలియా నివాస భవనం ముందు అనుమానితులు తచ్చాడుతున్నారని, హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

This post was last modified on March 22, 2022 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago