Trends

బంగారం తీసుకునేందుకు ఏటీఎంలు

ఏటీఎంలలో డబ్బులు తీసుకోవటం మనకు తెలుసు. ఆహార పొట్లాలను, మందులను, నీటిని కూడా ఏటీఎంలలో తీసుకోవచ్చని వినుంటాం. కానీ ఏకంగా బంగారాన్నే ఏటీఎంల్లో తీసుకోవటం గురించి ఎప్పుడైనా విన్నారా ? చూశారా ? ఇకనుండి హైదరాబాద్ లో బంగారం నాణాలను ఏటీఎంల్లో తీసుకోవచ్చు. హైదరాబాద్ లోని మూడు చోట్ల బంగారం నాణాలను అందించే ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు గోల్డ్ సిక్కా అనే సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ ప్రకటించారు.

బేగంపేటలో సంస్థ ప్రధాన కార్యాలయంలో సయ్యద్ మాట్లాడుతూ బంగారం నాణాలను అందించే ఏటీఎంలు బ్రిటన్లో ఐదు, దుబాయ్ లో రెండు న్నట్లు చెప్పారు. మనదేశంలో హైదరాబాద్ లో మొట్టమొదటి బంగారం ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 45 రోజుల్లో సిటీలోని గుల్జార్ హౌస్, అబిడ్స్, సికింద్రాబాద్ ఏరియాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారట. క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి అవసరమైన నాణాలను తీసుకోవచ్చన్నారు.

ఏటీఎంల్లో 0.5 గ్రాముల నుంచి 1, 2, 5,10, 20, 50,100 గ్రాముల బంగారం నాణాలుంటాయన్నారు. తొందరలోనే తమ సంస్ధ తరపున ప్రీపెయిడ్, పోస్ట్ పోయిడ్ కార్డులను కూడా జారీచేయబోతున్నట్లు సయ్యద్ చెప్పారు. తాము ఏర్పాటు చేయబోయే ఏటీఎంల్లో రోజువారీ అంతర్జాతీయ ధరలు డిస్ ప్లే అవుతుందన్నారు. తాము జారీ చేస్తున్న బంగారం నాణాల నాణ్యత, గ్యారెంటీ సర్టిపికేట్లను కూడా జారీచేయబోతున్నట్లు సయ్యద్ ప్రకటించారు.

అంతాబాగానే ఉంది కానీ బంగారాన్ని అందించే ఏటీఎంల భద్రతే అసలైన తలనొప్పిగా తయారవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం డబ్బులిచ్చే ఏటీఎంలను కేటుగాళ్ళు ఎలా దొంగలించుకుని వెళుతున్నది అందరు చూస్తున్నదే. ఏటీఎంలున్న రోడ్లలో, ఏటీఎంల దగ్గర ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఏదో పద్దతిలో దొంగతనాలు జరుగుతునే ఉన్నాయి. ఏటీఎంల నుండి డబ్బులు తీసుకోవటం సాధ్యం కాకపోతే ఏకంగా ఏటీఎంలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. మరిపుడు బంగారం ఏటీఎంల భద్రత విషయంలో యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో చూడాలి.

This post was last modified on March 18, 2022 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago