విచిత్రంగా ఉన్న ఇదే నిజం. రష్యాపై జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు ఇంతకాలం మద్దతుగా నిలిచిన నాటో దేశాలకే ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆ వార్నింగ్ ఏమిటంటే నాటో దేశాల ఎయిర్ స్పేస్ ను వెంటనే మూసేయాలని. అంటే రష్యా విమానాలు నాటో దేశాల గగనతలంపై ప్రయాణించకుండా వెంటనే నిషేధం విధించాలని అధ్యక్షుడు నాటో దేశాధినేతలను డిమాండ్ చేశారు.
ఇపుడు ఉక్రెయిన్ దేశం ఎయిర్ స్పేస్ పై నిషేధం ఉంది. కానీ ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న కారణంగా ఆ నిషేధం అమల్లో లేదు. నిషేధాన్ని ఉల్లంఘించి మరీ రష్యా సైన్యాలు ఉక్రెయిన్లోకి ప్రవేశించి నగరాలను ధ్వంసం చేసేస్తున్నాయి. పనిలో పనిగా కొన్ని దాడులు సరిహద్దు దేశమైన పోలండ్ మీద కూడా జరుగుతోంది. అయితే ఉక్రెయిన్ మీదకు సంధిస్తున్న క్షిపణులు కొన్ని గురితప్పి పోలండ్ భూభాగంలో పడుతున్నాయంతే.
ఇదే విషయమై జెలెన్ స్కీ మాట్లాడుతూ నాటో దేశాలపైన కూడా రష్యా యుద్ధం మొదలుపెడుతుందని వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే ఆయా దేశాలు ఎయిర్ స్పేస్ పై నిషేధం విధించకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయమన్నారు. యుద్ధం మొదలైన 18వ రోజున ఉక్రెయిన్లోని అనేక నగరాలపై రష్యా వైమానిక దళాలు ఒకేసారి విజృంభించాయి. దీని కారణంగా దాదాపు 70 మంది చనిపోగా కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐక్య రాజ్య సమితి శాంతి సైనికులు కూడా ఉండటం గమనార్హం.
18వ రోజు మొదలైన దాడుల్లో ఆసుపత్రులు, సైనిక శిబిరాలు, నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలు కూడా దాదాపు ధ్వంసమయ్యాయి. దీనివల్ల పోలండ్ వైపు వలసలు వెళుతున్న ఉక్రెయిన్ జనాలపైన కూడా బాంబులు కురవటంతో వాళ్ళల్లో కూడా కొందరు చనిపోయారు. దాదాపు పది రోజుల పాటు ఒక మాదిరి సైన్యంతోనే యుద్ధం చేస్తున్న రష్యా చివరి రెండు రోజులుగా తన తీవ్రతను ఒక్కసారిగా పెంచేసింది. దాంతోనే చాలా నగరాలు దెబ్బ తినేస్తున్నాయి. మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ముగిసే సమయానికి ఉక్రెయిన్ నామరూపాలు ఏ విధంగా ఉంటాయో ఎవరికీ అర్థం కావట్లేదు.
This post was last modified on March 14, 2022 1:02 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…