Trends

ఉక్రెయిన్ అధ్య‌క్షుడికి ప్ర‌ధాని మోడీ ఫోన్‌

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణలో భాగంగా.. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై ఇరు నేతలు చర్చించినట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు కొనసాగడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. దీంతోపాటు ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో అందించిన సహకారానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

సుమీ నుంచి భారతీయుల తరలింపునకు సహకారం కావాలని కోరారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోడీ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్‌ను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశానికి 100 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయినియన్ల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు తదితర ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడుతాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది.

ఉక్రెయిన్పై భీకర దాడులకు మరోమారు విరామమిచ్చింది రష్యా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్ వినతి మేరకు.. మానవతా కారిడార్ ఏర్పాటు కోసం తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు స్పుత్నిక్ మీడియా వెల్లడించింది.

తమ దేశంలోని రక్షణ పరిశ్రమలపై బాంబు దాడులకు పాల్పడతామని రష్యా ప్రకటించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. వీటిలో చాలా పరిశ్రమలు నివాసిత ప్రాంతాల వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై ఏ ప్రపంచ నేత స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని.. ఆ దేశ వైఖరే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago