Trends

కపిల్ రికార్డు బద్దలు కొట్టిన జడేజా

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతోంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఈ టెస్టును శాసించే బలమైన స్థితికి చేరుకుంది. దీంతో, రెండో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక టాపార్డర్ కుప్పకూలింది.

రెండో రోజు ఆటలో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జడేజా భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ రికార్డును బద్దలుగొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 150 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుపుటలకెక్కాడు. జడేజా కంటే ముందు కపిల్‌దేవ్, రిషభ్ పంత్ ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు. దీంతోపాటు సర్ జడేజా మరో రెండు రికార్డులు కూడా సాధించాడు.

ఏడో నంబర్ బ్యాట్స్ మన్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బరిలోకి దిగి ఒక ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీల భాగస్వామ్యాలు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా జడ్డూ నిలిచాడు. రిషబ్ పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 104 పరుగులు, అశ్విన్‌తో కలిసి 7వ వికెట్‌కు 130 పరుగులు, 9వ వికెట్‌కు షమీతో కలిసి 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. 7వ నంబర్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగుకు దిగి అజేయంగా 175 పరుగులు సాధించిన తొలి ఇండియన్‌గానూ జడేజా మరో రికార్డు సృష్టించాడు.

అంతకుముందు, ఓవర్‌నైట్ స్కోరు 357/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 574/8 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. పంత్ 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అశ్విన్ 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 29 పరుగుల వద్ద ఔట్ కాగా, విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశాడు. హనుమ విహారి 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

This post was last modified on March 6, 2022 4:12 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

7 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

8 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

9 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

10 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

10 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

11 hours ago