మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతోంది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఈ టెస్టును శాసించే బలమైన స్థితికి చేరుకుంది. దీంతో, రెండో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక టాపార్డర్ కుప్పకూలింది.
రెండో రోజు ఆటలో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జడేజా భారత దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ రికార్డును బద్దలుగొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 150 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్గా రికార్డుపుటలకెక్కాడు. జడేజా కంటే ముందు కపిల్దేవ్, రిషభ్ పంత్ ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు. దీంతోపాటు సర్ జడేజా మరో రెండు రికార్డులు కూడా సాధించాడు.
ఏడో నంబర్ బ్యాట్స్ మన్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బరిలోకి దిగి ఒక ఇన్నింగ్స్లో మూడు సెంచరీల భాగస్వామ్యాలు సాధించిన మొదటి బ్యాట్స్మెన్గా జడ్డూ నిలిచాడు. రిషబ్ పంత్తో కలిసి ఆరో వికెట్కు 104 పరుగులు, అశ్విన్తో కలిసి 7వ వికెట్కు 130 పరుగులు, 9వ వికెట్కు షమీతో కలిసి 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. 7వ నంబర్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగుకు దిగి అజేయంగా 175 పరుగులు సాధించిన తొలి ఇండియన్గానూ జడేజా మరో రికార్డు సృష్టించాడు.
అంతకుముందు, ఓవర్నైట్ స్కోరు 357/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పంత్ 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అశ్విన్ 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 29 పరుగుల వద్ద ఔట్ కాగా, విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశాడు. హనుమ విహారి 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
This post was last modified on March 6, 2022 4:12 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…