ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఖార్కీవ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందర్ బాగ్చి తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని కర్ణాటక హవేరి జిల్లాకు చెందిన నవీన్ జ్ఞానగౌడార్గా గుర్తించారు. సదరు విద్యార్థి ఉక్రెయిన్లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు బాగ్చి వెల్లడించారు. నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్లిన సమయంలో.. సైనిక దళాల షెల్లింగ్లో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులతో తాము టచ్లో ఉన్నామని స్పష్టం చేశారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఖార్కీవ్లో అనేక మంది భారత పౌరులు చిక్కుకునే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే విషయంపై రష్యా, ఉక్రెయిన్ రాయబారులతో విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడారు. ఘర్షణాత్మక ప్రాంతాల్లోని భారతీయులను తరలించేందుకు రష్యా, ఉక్రెయిన్ సాయం చేయాలని భారత్ డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘర్షణ లేని ప్రదేశాల్లోని పౌరులను సొంతంగా తరలించిన విషయాన్ని గుర్తు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 9 వేల మంది భారత పౌరులు ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చారని, అనేక మంది సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారని స్పష్టం చేశారు. పౌరుల తరలింపుపై రష్యా, ఉక్రెయిన్ దేశాల్లోని భారత రాయబారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అయితే, ఉక్రెయిన్లో చిక్కుకున్నవారికి అధికారుల నుంచి సహకారం అందలేదని మృతుడి తండ్రి శేఖరగౌడ ఆరోపించారు. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులెవరూ విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నించడం లేదని అన్నారు. ఖార్కివ్లోని ఓ బంకర్లో నవీన్తో పాటు అతడి స్నేహితులు తలదాచుకున్నారని మృతుడి మామ ఉజ్జయనగౌడ వెల్లడించారు. మంగళవారం ఉదయం తన తండ్రికి నవీన్ ఫోన్ చేశాడు. బంకర్లో ఆహారం, నీళ్లు అందుబాటులో లేవని చెప్పాడు. కరెన్సీ ఎక్స్ఛేంజీ చేసుకొని, ఆహారాన్ని కొనుక్కునేందుకు బంకర్ నుంచి నవీన్ బయటకు వెళ్లాడు. అదే సమయంలో షెల్లింగులతో దాడులు జరిగాయి. దీంతో నవీన్ అక్కడికక్కడే మరణించాడు’ అని ఉజ్జయనగౌడ వివరించారు.
కాగా, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శేఖరగౌడకు ఫోన్ చేశారు. నవీన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవీన్ భౌతికకాయాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…