వివిధ గుర్తింపు పత్రాలను ఏకతాటిపై తీసుకురావటానికి వీలుగా తొందరలోనే కొత్తగా డిజిటల్ ఐడీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి అనేక కీలక పత్రాలకు ఒకే ఐడీతో అనుసంధానం చేయాలని కేంద్రం తాజాగా డిసైడ్ చేసింది. దీనికి డిజిటల్ ఐడీ రెడీ చేయటమే ఏకైక మార్గమని కూడా కేంద్రం నిర్ణయానికి వచ్చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ ఐటి శాఖ ఒక మోడల్ ను ప్రతిపాదించింది.
కొత్త ప్రతిపాదనలో భాగంగా ఇప్పటివరకు ఆధార్ కార్డు నెంబర్ ఉన్నట్లే కొత్తగా రాబోయే డిజిటల్ ఐడీకి కూడా ఒక విశిష్ట నెంబర్ ఉండచ్చంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును ఉపయోగించటానికి వీలుగా ఈ నెంబర్ ఉంటుందని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తం ఒకే చోట ఉండటానికి వీలుగా కొత్త డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుందట. కేవైసీ (నో యువర్ కస్టమర్ లేదా ఈ కేవైసీ తో డిజిటల్ ఐడీని అనుసంధానం చేయటం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారమవుతుందట.
ప్రస్తుతం దేశంలోని జనాభాలో ఎక్కువ భాగం అనేక అవసరాలకు అనేక కార్డులను ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరపున అవసరమైన చోట్ల గుర్తింపు కార్డులుగా పాస్ పోర్టు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ఐడీ వ్యవస్ధ గనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో అన్నీ అవసరాలకు వివిధ గుర్తింపుకార్డులను ఇచ్చే బదులు ఒక డిజిటల్ ఐడి నెంబర్ ఇస్తే సరిపోతుందట.
ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్న ఈ డిజిటల్ ఐడీ వ్యవస్థను అనేక శాఖలు, అనేకమంది నిపుణులు పరిశీలిస్తున్నారు. నిజానికి ఆధార్ కార్డును తీసుకురావాలని అనుకున్నపుడు కూడా అప్పట్లో కేంద్రం ఇదే మాట చెప్పింది. అవసరం ఏదైనా కానీండి ప్రతిదానికీ ఆధార్ కార్డు నెంబర్ ను, జిరాక్స్ కాపీని ఉపయోగిస్తున్నారు. అన్ని అవసరాలకు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నపుడు మళ్ళీ కొత్తగా డిజిటల్ ఐడీ వ్యవస్ధను ఎందుకు తీసుకురాబోతోందో అర్ధం కావటం లేదు.
This post was last modified on January 31, 2022 11:44 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…