Trends

అనూహ్యంగా పెరిగిపోతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందులో 14,450 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారవర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో మూడో వంతు మందికి కరోనా ఉండటమంటే మామూలు విషయం కాదు. జనవరి 10వ తేదీన రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు 4 శాతం ఉంది.

అలాంటిది 23వ తేదీకి పాజిటివిటీ రేటు  31 శాతానికి పెరిగింది. అంటే 14 రోజుల్లో పాజిటివిటీ రేటు 27 శాతం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో కనబడుతోంది. ఒక్క ఆదివారం మాత్రమే జిల్లాలో 2258 కేసులు నమోదయ్యాయి. వారం క్రితంవరకు కేవలం 2 జిల్లాల్లో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఇపుడు కృష్ణా జిల్లా తప్ప మిగిలిన 12 జిల్లాల్లో సగటున 500 కేసులు నమోదవుతున్నాయి. వీటిల్లో కూడా 8 జిల్లాల్లో  సగటున వెయ్యి కేసులు రికార్డవుతుండటమే టెన్షన్ పెంచేస్తోంది.

ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరులో 1438 కేసులు, ప్రకాశ జిల్లాలో 1399 కేసులు, కర్నూలు జిల్లాలో 1238 కేసులు, చిత్తూరు జిల్లాలో 1138, నెల్లూరు జిల్లాలో 1103 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1012 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 18వ తేదీన 462 కేసులు నమోదైతే 23వ తేదీ వచ్చేటప్పటికి  1534 కేసులకు పెరిగింది. గుంటూరు జిల్లాలో కూడా 758 కేసుల నుండి 1438 కేసులకు పెరిగింది.

ఒకపుడు బాగా కేసులు నమోదైన చిత్తూరు జిల్లాలో ఇపుడు క్రమంగా తగ్గుతోంది. ఇక్కడ ప్రధానంగా టీటీడీ తీసుకుంటున్న చర్యలతో పాటు ఇతర అధికార యంత్రాంగం కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవటం వల్ల కేసుల సంఖ్య తగ్గుతోంది. ఏదేమైనా కరోనా వైరస్+ఒమిక్రాన్ కేసులు కొన్ని జిల్లాల్లో బాగా పెరుగుతు మరికొన్ని జిల్లాల్లో తక్కువగా ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కేసుల సంఖ్య తగ్గే అవకాశముంది. మొత్తానికి అధికార యంత్రాంగం మరికొంత కొంతకాలం పాటు రిలాక్సయ్యేందుకు అయితే లేదు.

This post was last modified on January 24, 2022 11:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago