Trends

అనూహ్యంగా పెరిగిపోతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందులో 14,450 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారవర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో మూడో వంతు మందికి కరోనా ఉండటమంటే మామూలు విషయం కాదు. జనవరి 10వ తేదీన రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు 4 శాతం ఉంది.

అలాంటిది 23వ తేదీకి పాజిటివిటీ రేటు  31 శాతానికి పెరిగింది. అంటే 14 రోజుల్లో పాజిటివిటీ రేటు 27 శాతం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో కనబడుతోంది. ఒక్క ఆదివారం మాత్రమే జిల్లాలో 2258 కేసులు నమోదయ్యాయి. వారం క్రితంవరకు కేవలం 2 జిల్లాల్లో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఇపుడు కృష్ణా జిల్లా తప్ప మిగిలిన 12 జిల్లాల్లో సగటున 500 కేసులు నమోదవుతున్నాయి. వీటిల్లో కూడా 8 జిల్లాల్లో  సగటున వెయ్యి కేసులు రికార్డవుతుండటమే టెన్షన్ పెంచేస్తోంది.

ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరులో 1438 కేసులు, ప్రకాశ జిల్లాలో 1399 కేసులు, కర్నూలు జిల్లాలో 1238 కేసులు, చిత్తూరు జిల్లాలో 1138, నెల్లూరు జిల్లాలో 1103 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1012 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 18వ తేదీన 462 కేసులు నమోదైతే 23వ తేదీ వచ్చేటప్పటికి  1534 కేసులకు పెరిగింది. గుంటూరు జిల్లాలో కూడా 758 కేసుల నుండి 1438 కేసులకు పెరిగింది.

ఒకపుడు బాగా కేసులు నమోదైన చిత్తూరు జిల్లాలో ఇపుడు క్రమంగా తగ్గుతోంది. ఇక్కడ ప్రధానంగా టీటీడీ తీసుకుంటున్న చర్యలతో పాటు ఇతర అధికార యంత్రాంగం కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవటం వల్ల కేసుల సంఖ్య తగ్గుతోంది. ఏదేమైనా కరోనా వైరస్+ఒమిక్రాన్ కేసులు కొన్ని జిల్లాల్లో బాగా పెరుగుతు మరికొన్ని జిల్లాల్లో తక్కువగా ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కేసుల సంఖ్య తగ్గే అవకాశముంది. మొత్తానికి అధికార యంత్రాంగం మరికొంత కొంతకాలం పాటు రిలాక్సయ్యేందుకు అయితే లేదు.

This post was last modified on January 24, 2022 11:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

2 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

3 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

5 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

5 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

6 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

6 hours ago