Trends

బిల్ గేట్స్ మీద లైంగిక ఆరోపణలు

ఇవాల్టి రోజున ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ప్రత్యక్షం కానీ.. పరోక్షంగా కానీ ప్రభావితం చేసే కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. ఆధునిక మనిషి జీవితాన్ని.. వారి జీవన గమనాన్ని మరింత సరళంగా.. సౌకర్యవంతంగా మార్చటంలో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నాన్ని ఎవరూ మర్చిపోలేదు. అలాంటి ఈ సంస్థ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల మీద లైంగిక ఆరోపణలు రావటం ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాయి.

గతంలోకి వెళితే.. 2007లో గేట్స్ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ గా ఉన్న వేళలో ఒక మహిళా ఉద్యోగికి ఆయన అభ్యంతరకర ఈ మొయిల్ పంపటమే కాదు.. ఆమెను బయట పర్సనల్ గా కలవాలని ఆహ్వానించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఉదంతం జరిగిన ఏడాది తర్వాత కంపెనీ బోర్డు ద్రష్టికి ఈ విషయం వెళ్లింది. ఇది సరైన తీరుకాదని.. సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల టీం గేట్స్ కు వార్నింగ్ ఇచ్చింది. అయితే.. ఈ మొయిళ్లను తాను పంపిన విషయాన్ని గేట్స్ అంగీకరించటం గమనార్హం.

ఆ ఆరోపణల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి తప్పుకున్నట్లుగా బిల్ గేట్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కంపెనీ అంతర్గతంగా కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చింది. లింగ వివక్ష లాంటి అంశాల్లో కంపెనీ విధానాల్ని సమీక్షించాలని కంపెనీ షేర్ హోల్డర్లు చేసిన సూచనను మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. ఈ డిమాండ్ ను ప్రధానంగా వినిపించిన షేర్ హోల్డర్లలో అర్జున క్యాపిటల్ ఒకటిగా చెబుతారు.
ఇందులో భాగంగా ‘‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్ పీ’’ అనే న్యాయ విచారణ సంస్థను నియమించుకొని.. గేట్స్ మీద వచ్చిన ఆరోపణలను సమీక్షించనుంది. అంతేకాదు.. 2019 తర్వాత బోర్డు సభ్యులతో సమా ఇతర ఉన్నతస్థాయి వ్యక్తులపై వచ్చిన అన్ని రకాల వేధింపుల ఆరోపణలపైనా విచారణ చేయాలని నిర్ణయించింది.

ఈ విచారణ అనంతరం బోర్డుకు.. కంపెనీ యాజమాన్యానికి కొన్ని సిపార్సుల్ని చేయనుంది. వాటిని ఎలా అమలు చేయాలన్న విషయాన్ని వివరించనుంది. దీనికి సంబంధించిన నివేదిక ఈ వేసవికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమ విచారణలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆందోళనలు.. వాటి పరిష్కారానికి కంపెనీ తీసుకున్న చర్యలపైనా ఈ విచారణ సంస్థ ప్రధానంగా ఫోకస్ చేయనుంది.ఇతర కంపెనీల్లో అనుసరించే ఉత్తమ విధానాలతో మైక్రోసాఫ్ట్ నిబంధనల్ని పోల్చి రేటింగ్ కూడా ఇవ్వనుంది.
ఈ అంశంపై మెక్రోసాఫ్ట్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. కంపెనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తమకున్న అవకాశంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. కంపెనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఇదో అవకాశమన్నారు. కేవలం సమీక్షకు మాత్రమే కాకుండా ఉద్యోగుల అనుభవాల్ని కూడా పరిగణలోకి తీసుకొని సంస్థను మరింత ఉన్నత స్థానంలోకి తీసుకెళతామని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on January 15, 2022 5:30 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

2 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

3 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

3 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

4 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

4 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

4 hours ago