Trends

హైద‌రాబాద్‌లో 5G నెట్ వర్క్

దేశీయంగా టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. 2022లో దేశంలో 5జీ సేవలు అందుబాటు లోకి రానున్నాయి. అయితే.. ఈ సేవ‌ల‌ను దేశ‌వ్యాప్తంగా అందిస్తున్న‌ప్ప‌టికీ.. కొన్ని న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అయితే.. వీటిలో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. అదేవిధంగా గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జామ్‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, లఖ్నవూ, పుణె, గాంధీనగర్ వంటి కీల‌క న‌గ‌రాల్లో మాత్ర‌మే 5జీ సేవలను తొలుత అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ తెలిపింది.

దిగ్గజ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. దేశంలో 5జీ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు, మొబైల్ తయారీ కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. 5జీ టెక్నాలజీ అభివృద్ధి, పరీక్షించ డం కోసం పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసింది టెలికాం విభాగం.

స్వదేశీ 5జీ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్గా పిలిచే పరిశోధనా సంస్థలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పుర్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సహా మరో రెండు టెక్ పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.224 కోట్లు ఖర్చు చేసినట్లు డాట్ తెలిపింది. 2022 మార్చి-ఏప్రిల్ నెలల్లో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ సైజు, స్పెక్ట్రమ్ క్వాంటంకు సంబంధించి టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) నుంచి సిఫార్సులను కోరింది డాట్. ట్రాయ్ తన వంతుగా పరిశ్రమ వాటాదారులతో ఈ సమస్యపై సంప్రదింపులు ప్రారంభించింది. వ‌చ్చే ఏడాది మార్చిలోపే.. వినియోగ‌దారుల‌కు 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు విశేషంగా కృషి చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ సేవ‌ల రుసుముల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on December 28, 2021 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు.…

15 minutes ago

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

23 minutes ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

53 minutes ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

3 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

3 hours ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

3 hours ago