భారత్-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో కివీస్ స్పిన్నర్ అజాజ్ యూనుస్ పటేల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ కు చెందిన జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై 10/53తో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఇక, టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ‘జంబో’ అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్పై 10/74తో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. తాజా ప్రదర్శనతో ఈ ఇద్దరి సరసన అజాజ్ పటేల్ 10/119 చేరాడు.
అజాజ్ దెబ్బకు టీమిండియా 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్ ధాటికి కీలక సమయాల్లో వరుస వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేయగా…శుభమన్ గిల్ 44, చటేశ్వర్ పూజారా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 18, వృద్ధిమాన్ సాహా 27, అశ్విన్ 0, అక్షర్ పటేల్ 52, జయంత్ యాదవ్ 12, ఉమేశ్ యాదవ్ 0 (నాటౌట్), సిరాజ్ 4 పరుగులు చేసి ఔటయ్యారు.
మూడేళ్ల క్రితం టెస్టు క్రికెట్ లో అడుగుపెట్టిన అజాజ్ కు ఇది 11వ టెస్టు. ఈ మ్యాచ్ ముందు వరకూ 29 వికెట్లు తీసిన అజాజ్…ఒక్క ఇన్నింగ్స్లోనే 10 వికెట్లు తీసి సత్తా చాటాడు. 47.5 ఓవర్లు వేసిన అజాజ్ పటేల్ 2.20 ఎకానమీతో 119 పరుగులిచ్చి 10 వికెట్లను పడగొట్టాడు. ఇందులో 12 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. అజాజ్ ‘దశా’వతారంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. భారత్ గడ్డపై ఓ పర్యాటక జట్టు స్పిన్నర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు ఇవే కావడం విశేషం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…
తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్…