Trends

భారత్ లో ఒమిక్రాన్ తొలి కేసు…హైదరాబాద్ లో హై అలర్ట్

కరోనా సెకండ్ వేవ్ నుంచి, డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 28 దేశాలకు శరవేగంగా విస్తరించిన ఈ వేరియంట్…తాజాగా భారత్ లోకి ప్రవేశించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. బెంగళూరులో 44 ఏళ్లు, 66 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తుల్లో ఈ ఒమిక్రాన్ లక్షణాలు గుర్తించామని తెలిపింది.  దీంతో, ప్రజలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నాయి.

మరోవైపు, హైదరాబాద్ కూ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. యూకే నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, అది ఒమిక్రాన్ వేరియంట్ అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఆమెను హైదరాబాదులోని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమె శాంపిల్స్ ను జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని తెలిపారు. అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అన్నది మరో మూడు రోజుల్లో తేలుతుందని వెల్లడించారు.

ఆ మహిళ రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని, ఆమె బంధువుకు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెప్పారు. తెలంగాణకు కూడా ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే రూ. వెయ్యి ఫైన్ విధిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు ధరించకపోతే మన నిర్లక్ష్యానికి మనమే మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని, అది ఆత్మహత్యతో సమానమని షాకింగ్ కామెంట్లు చేశారు. ఒమిక్రాన్ బారిన పడిన రిస్క్ దేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన 239 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

This post was last modified on December 2, 2021 6:11 pm

Share

Recent Posts

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

40 minutes ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

48 minutes ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

56 minutes ago

థియేటర్లలో వావ్… ఇప్పుడు వామ్మో

కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…

2 hours ago

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

4 hours ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

4 hours ago