Trends

భారత్ లో ఒమిక్రాన్ తొలి కేసు…హైదరాబాద్ లో హై అలర్ట్

కరోనా సెకండ్ వేవ్ నుంచి, డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 28 దేశాలకు శరవేగంగా విస్తరించిన ఈ వేరియంట్…తాజాగా భారత్ లోకి ప్రవేశించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. బెంగళూరులో 44 ఏళ్లు, 66 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తుల్లో ఈ ఒమిక్రాన్ లక్షణాలు గుర్తించామని తెలిపింది.  దీంతో, ప్రజలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నాయి.

మరోవైపు, హైదరాబాద్ కూ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. యూకే నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, అది ఒమిక్రాన్ వేరియంట్ అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఆమెను హైదరాబాదులోని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమె శాంపిల్స్ ను జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని తెలిపారు. అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అన్నది మరో మూడు రోజుల్లో తేలుతుందని వెల్లడించారు.

ఆ మహిళ రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని, ఆమె బంధువుకు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెప్పారు. తెలంగాణకు కూడా ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే రూ. వెయ్యి ఫైన్ విధిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు ధరించకపోతే మన నిర్లక్ష్యానికి మనమే మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని, అది ఆత్మహత్యతో సమానమని షాకింగ్ కామెంట్లు చేశారు. ఒమిక్రాన్ బారిన పడిన రిస్క్ దేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన 239 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

This post was last modified on December 2, 2021 6:11 pm

Share
Show comments

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

12 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago