Trends

దేశంలోనే అతి పెద్ద సైబర్ స్కామ్ గుట్టురట్టు

ఈ టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్న తరుణంలోనే సైబర్ కేటుగాళ్ల ఆన్ లైన్ ఆర్థిక నేరాలు పెరిగిపోవడం కలవరపెడుతోంది. ఓటీపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దని, ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు చెబుతున్నప్పటికీ…కొందరు అమాయకులు కేటుగాళ్ల మాయలో పడి భారీ మొత్తంలో డబ్బులు నష్టపోతున్నారు.

ఇక, ఏకంగా తాము బ్యాంకులనుంచే మాట్లాడుతున్నామంటూ కొందరు సైబర్ మోసగాళ్లు కొత్త క్రైంకు తెరతీశారు. ఈ క్రమంలోనే తాజాగా దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో కొందరు మోసగాళ్లు నడుపుతున్న నకిలీ కాల్ సెంటర్ రాకెట్ ను ఛేదించామని తెలిపారు. ఇలా జనం నుంచి వందల కోట్లు కొట్టేసిన కేటుగాళ్లను కటకటాల వెనక్కు నెట్టామని వెల్లడించారు.

ఈ స్కామ్ లో ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా 18601801290 అనే నంబర్ నుంచి స్ఫూఫింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు కస్టమర్లను మోసగాళ్లు నమ్మించేవారు. ఇలా ఒక ఏడాదిలో 33 వేల కాల్స్ చేసి, వందల కోట్లు కొట్టేశారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి కస్టమర్ల వివరాలు సేకరించి క్రెడిట్ కార్డు ఉన్నవారిని టార్గెట్ చేసేవారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులున్నాయి. చివరకు వారిపాపం పండడంతో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 30 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు.

This post was last modified on December 2, 2021 5:19 pm

Share
Show comments

Recent Posts

చంద్ర‌బాబు-పీ4-ప్ర‌జ‌ల‌కు ఎక్కుతుందా ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా పీ-4 విధానంపై దృష్టి పెట్టారు. ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్ట‌న‌ర్ షిప్‌గా పే ర్కొంటున్న ఈ విధానాన్ని ప్ర‌జ‌ల్లోకి…

1 minute ago

‘స్థానికం’లో జ‌న‌సేన త‌ప్పుకొంది.. రీజ‌నేంటి ..!

స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి చైర్ ప‌ర్స‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌కు సంబంధించిన పోటీ తీవ్ర‌స్థాయిలో జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం…

3 minutes ago

బన్నీ – దేవి : ఆరు మెలోడీల లవ్ స్టోరీ

అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…

40 minutes ago

ఆయ‌న ‘ఎన్నిక‌ల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేషన్ వ‌ర్గీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి…

1 hour ago

స్టార్ పిల్లలను పట్టించుకోవడం లేదబ్బా

మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…

1 hour ago

టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…

1 hour ago