Trends

దేశంలోనే అతి పెద్ద సైబర్ స్కామ్ గుట్టురట్టు

ఈ టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్న తరుణంలోనే సైబర్ కేటుగాళ్ల ఆన్ లైన్ ఆర్థిక నేరాలు పెరిగిపోవడం కలవరపెడుతోంది. ఓటీపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దని, ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు చెబుతున్నప్పటికీ…కొందరు అమాయకులు కేటుగాళ్ల మాయలో పడి భారీ మొత్తంలో డబ్బులు నష్టపోతున్నారు.

ఇక, ఏకంగా తాము బ్యాంకులనుంచే మాట్లాడుతున్నామంటూ కొందరు సైబర్ మోసగాళ్లు కొత్త క్రైంకు తెరతీశారు. ఈ క్రమంలోనే తాజాగా దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో కొందరు మోసగాళ్లు నడుపుతున్న నకిలీ కాల్ సెంటర్ రాకెట్ ను ఛేదించామని తెలిపారు. ఇలా జనం నుంచి వందల కోట్లు కొట్టేసిన కేటుగాళ్లను కటకటాల వెనక్కు నెట్టామని వెల్లడించారు.

ఈ స్కామ్ లో ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా 18601801290 అనే నంబర్ నుంచి స్ఫూఫింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు కస్టమర్లను మోసగాళ్లు నమ్మించేవారు. ఇలా ఒక ఏడాదిలో 33 వేల కాల్స్ చేసి, వందల కోట్లు కొట్టేశారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి కస్టమర్ల వివరాలు సేకరించి క్రెడిట్ కార్డు ఉన్నవారిని టార్గెట్ చేసేవారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులున్నాయి. చివరకు వారిపాపం పండడంతో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 30 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు.

This post was last modified on December 2, 2021 5:19 pm

Share
Show comments

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

2 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

3 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

5 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

6 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

7 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

8 hours ago