ఈ టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్న తరుణంలోనే సైబర్ కేటుగాళ్ల ఆన్ లైన్ ఆర్థిక నేరాలు పెరిగిపోవడం కలవరపెడుతోంది. ఓటీపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దని, ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు చెబుతున్నప్పటికీ…కొందరు అమాయకులు కేటుగాళ్ల మాయలో పడి భారీ మొత్తంలో డబ్బులు నష్టపోతున్నారు.
ఇక, ఏకంగా తాము బ్యాంకులనుంచే మాట్లాడుతున్నామంటూ కొందరు సైబర్ మోసగాళ్లు కొత్త క్రైంకు తెరతీశారు. ఈ క్రమంలోనే తాజాగా దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో కొందరు మోసగాళ్లు నడుపుతున్న నకిలీ కాల్ సెంటర్ రాకెట్ ను ఛేదించామని తెలిపారు. ఇలా జనం నుంచి వందల కోట్లు కొట్టేసిన కేటుగాళ్లను కటకటాల వెనక్కు నెట్టామని వెల్లడించారు.
ఈ స్కామ్ లో ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా 18601801290 అనే నంబర్ నుంచి స్ఫూఫింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు కస్టమర్లను మోసగాళ్లు నమ్మించేవారు. ఇలా ఒక ఏడాదిలో 33 వేల కాల్స్ చేసి, వందల కోట్లు కొట్టేశారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి కస్టమర్ల వివరాలు సేకరించి క్రెడిట్ కార్డు ఉన్నవారిని టార్గెట్ చేసేవారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులున్నాయి. చివరకు వారిపాపం పండడంతో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 30 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు.
This post was last modified on December 2, 2021 5:19 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…