‘ద హండ్రెడ్’ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ వ్యవహారంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మనం ఇచ్చే ఫీజుల ద్వారా ఆ ఆటగాళ్లు పాక్ ప్రభుత్వానికి పన్నులు కడతారని, ఆ డబ్బుతో కొనే ఆయుధాలు మన సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలను తీస్తాయని ఆయన చేసిన హెచ్చరిక మేకర్స్ను ఆత్మరక్షణలో పడేసింది.
గతంలో ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లు బంగ్లాదేశ్ ప్లేయర్ల విషయంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ ఇప్పుడు సన్రైజర్స్ ఏకంగా పాక్ ప్లేయర్ను ఎంచుకోవడం ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్కే మైనస్గా మారుతోంది. కేవలం లీగ్ కోసం మన దేశ పౌరుల సెంటిమెంట్లను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. గవాస్కర్ లాంటి సీనియర్ ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వ్యవహారం వల్ల సన్రైజర్స్ లీడ్స్ మ్యాచ్లను భారతీయ అభిమానులు బహిష్కరించే అవకాశం ఉందని గవాస్కర్ హెచ్చరించారు. మైదానంలో ఆటగాళ్లు ఎంత బాగా ఆడినా, గ్యాలరీల్లో జనం లేకపోతే ఆ గెలుపుకు విలువేముంటుందని ఆయన ప్రశ్నించారు. కోచ్ డానియల్ వెట్టోరీకి మన దేశ పరిస్థితులు తెలియకపోవచ్చు కానీ, యాజమాన్యం మాత్రం ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందని ఆయన తన కాలమ్లో పేర్కొన్నారు.ఇప్పటికే సన్రైజర్స్ లీడ్స్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నిలిపివేయబడటం ఈ నిరసనలకు నిదర్శనం. మరోవైపు బీసీసీఐ ఈ విషయంలో ‘చేతులు ఎత్తేసింది’. ఇది విదేశీ లీగ్కు సంబంధించిన విషయం కావడంతో తాము జోక్యం చేసుకోలేమని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
అంటే ఇప్పుడు బంతి పూర్తిగా సన్రైజర్స్ యాజమాన్యం కోర్టులోనే ఉంది. అటు గవాస్కర్ హెచ్చరికలు, ఇటు ఫ్యాన్స్ ఆగ్రహం మధ్య కావ్య మారన్ బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉందని గవాస్కర్ సూచించడం గమనార్హం. ఏదేమైనా ఒక పాక్ ప్లేయర్ ఎంపిక ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ ఇమేజ్పై కూడా ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఐపీఎల్లో అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన సన్రైజర్స్, ఇలాంటి వివాదాల వల్ల తన ఫ్యాన్ బేస్ను కోల్పోయే ప్రమాదం ఉంది. దేశభక్తి ముందు క్రికెట్ చిన్నదనే భావన ఉన్న మన దేశంలో, ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…