ఏవైనా బంధువులో మిత్రులో ప్రజలకు సేవ చేసినవారో.. తుదిశ్వాస విడిస్తే.. నిర్వహించే అంతిమ యాత్రకు బంధువర్గం.. అభిమానులు.. పోటెత్తడం ఖాయం. అయితే.. ఒక బిచ్చగాడు చనిపోతే.. అది కూడా రోడ్డుపక్కన ప్రాణం విడిస్తే.. ఎవరైనా పట్టించుకుంటారా? కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఏమునిసిపాలిటీ వాళ్లో వచ్చి.. తీసుకుపోయి.. శ్మశానంలో అప్పగిస్తారు. చేతులు దులుపుకొంటారు! అంతకుమించి జరిగేది ఏమీ ఉండదు. కానీ.. అందరి బిచ్చగాళ్లలో ఈ బిచ్చగాడు వేరయా! అన్నట్టుగా ఉంది కర్ణాటకలోని ఒక బిచ్చగాడి పరిస్థితి.
కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్ర కు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిదులు కూడా వచ్చారు. నిజానికి ఎవరైనా ప్రముఖులు చనిపోతే వచ్చేంత మంది ఈ బిచ్చగాడు మరణిస్తే చూసేందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కర్ణాటక బళ్లారిలోని హడగళికి చెందిన బసవ అలియాస్ హుచ్చా బాస్యా అనే యాచకుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇతని అంతమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. దీనికి కారణం ఆయనతో ఆ పట్టణ వాసులకు ఉండే ప్రత్యేక అనుబంధమే.
బసవకు భిక్షం పెడితే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చాలా మంది పిలిచి మరీ అతనికి అన్నదానం చేసేవారు. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాస్యా మృతి చెందాడు. దీంతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలో బ్యానర్లు కట్టి.. ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. బాస్యా మరణ వార్త విన్న చాలా మంది ప్రజలు అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలకరించిన వారందినీ బాస్యా.. అప్పాజీ(నాన్నగారు) అని పిలిచే వాడని తెలిపారు. భిక్షం ఎత్తుకుని జీవనం సాగించే అతడు.. డబ్బులు ఎంత ఇచ్చినా 1 రూపాయి మాత్రమే తీసుకుని మిగతా సొమ్మును వెనక్కి ఇచ్చేవాడు.
మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత ఎం.పి. ప్రకాశ్, మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ లాంటి రాజకీయ నాయకులందరితో ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడే వాడని స్థానికులు చెప్తున్నారు. బాస్యాతో మాట్లాడడాన్ని కూడా చాలా మంది అదృష్టంగా భావించేవారని, అందుకే అతడ్ని ఇలా గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి బిచ్చగాడికి లభించిన అంతిమ గౌరవం… ప్రస్తుతం నెటిజన్లను ఫిదా చేస్తుండడం గమనార్హం. అందరూ ‘రిప్’ అంటూ సందేశాలు పెడుతున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…