అండర్ వరల్డ్ మాపియా డాన్ దావూద్ ఇబ్రహీంకి కరోనా సోకింది. అతనితో పాటు అతని భార్యకు కూడా కరోనా సోకడం గమనార్హం. పాకిస్తాన్ ప్రభుత్వంలోని కొందరు అధికారుల ద్వారా ఈ సమాచారం మాకు అందినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. దీంతో దావూద్ భద్రతా సిబ్బంది మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇతను కరాచీలో ఉన్నట్లు మనకు తెలిసిన సమాచారమే.
దావూద్ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడు. ఇతని పూర్తి పేరు దావూద్ ఇబ్రహీం కష్కర్. ఇతను భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారి. ఇతనిపై ఇప్పటికే అనేక ఇంటర్ పోల్ నోటీసులు జారీ అయినా కరాచీలో తలదాచుకుంటున్నాడు. ఇతని స్థావరాన్ని పాకిస్తాన్ బయటకు వెల్లడించడం లేదు. ఇండియాతో పాటు అమెరికా కూడా ఇతనిని 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్ (అంతర్జాతీయ ఉగ్రవాది)గా ప్రకటించింది.
ఇతనికి పాకిస్తాన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే… మిలిటరీ ఆస్పత్రిలో ప్రత్యేక భద్రత మధ్య వైద్యం అందిస్తోంది. ఇతడు తన కార్యకలాపాలను డి – కంపెనీ పేరు మీద నిర్వహిస్తుంటాడు. దావూద్ భార్య మెహెజాబీన్ కూడా డి కంపెనీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటుందట. దావూద్ ని పట్టించిన వారికి 2.5 కోట్ల డాలర్లు రివార్డు ఇస్తామని అమెరికా భారత్ లు ప్రకటించినా… అతను ఇప్పటికీ దొరకడం లేదు.
This post was last modified on June 5, 2020 10:21 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…