అండర్ వరల్డ్ మాపియా డాన్ దావూద్ ఇబ్రహీంకి కరోనా సోకింది. అతనితో పాటు అతని భార్యకు కూడా కరోనా సోకడం గమనార్హం. పాకిస్తాన్ ప్రభుత్వంలోని కొందరు అధికారుల ద్వారా ఈ సమాచారం మాకు అందినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. దీంతో దావూద్ భద్రతా సిబ్బంది మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇతను కరాచీలో ఉన్నట్లు మనకు తెలిసిన సమాచారమే.
దావూద్ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడు. ఇతని పూర్తి పేరు దావూద్ ఇబ్రహీం కష్కర్. ఇతను భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారి. ఇతనిపై ఇప్పటికే అనేక ఇంటర్ పోల్ నోటీసులు జారీ అయినా కరాచీలో తలదాచుకుంటున్నాడు. ఇతని స్థావరాన్ని పాకిస్తాన్ బయటకు వెల్లడించడం లేదు. ఇండియాతో పాటు అమెరికా కూడా ఇతనిని 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్ (అంతర్జాతీయ ఉగ్రవాది)గా ప్రకటించింది.
ఇతనికి పాకిస్తాన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే… మిలిటరీ ఆస్పత్రిలో ప్రత్యేక భద్రత మధ్య వైద్యం అందిస్తోంది. ఇతడు తన కార్యకలాపాలను డి – కంపెనీ పేరు మీద నిర్వహిస్తుంటాడు. దావూద్ భార్య మెహెజాబీన్ కూడా డి కంపెనీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటుందట. దావూద్ ని పట్టించిన వారికి 2.5 కోట్ల డాలర్లు రివార్డు ఇస్తామని అమెరికా భారత్ లు ప్రకటించినా… అతను ఇప్పటికీ దొరకడం లేదు.
This post was last modified on June 5, 2020 10:21 pm
జగన్ .. సంపాదనను నా సంపాదనతో పోల్చవద్దు. ఆయనది అక్రమ సంపాదన అని అంతా(సీబీఐ) అంటున్నారు. నాది అలా కాదు.…
ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.…
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని రాజకీయ దురంధరుడిగా.. చాణక్యుడిగా ఆయన అభిమానులు అభివర్ణిస్తుంటారు. బాబును రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా…
"బొత్స.. మా నాన్నను తాగుబోతు అన్నాడు.. జగన్ మరిచిపోయాడా?"- అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఉత్తరాది రాష్ట్రాల్లో సరైన సినిమాలు లేక ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతున్నారు. కనీసం కరెంటు బిల్లులు, జీతాల చెల్లింపులకు సరిపడా కలెక్షన్లు…
ఇండియన్ ప్రిమియర్ లీగ్లో చాలా చోట్లకు తమ సొంత రాష్ట్రంలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్,…