Trends

అట్లాస్ సైకిల్.. ఇక కనిపించదు

అట్లాస్ సైకిల్.. అది కేవలం సైకిల్ కాదు. ఒక ఎమోషన్. భారతీయ ప్రజల జీవనంలో భాగం అయిపోయిన వస్తువది. ఇండియాలో సైకిల్ బ్రాండ్లలో అత్యంత ఆదరణ ఉన్న అట్లాస్.. ఇప్పుడు కనుమరుగు కానుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక అట్లాస్ సైకిల్ ఉండేది. ఐతే మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఈ సైకిల్ బ్రాండ్ ఉత్పత్తిని ఆపేస్తున్నారు.

సైకిళ్లకు అసలు గిరాకీ లేకపోవడం, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో తమ మానుఫ్యాక్చరింగ్ ప్లాంటును మూసి వేస్తున్నట్లు అట్లాస్ కంపెనీ ప్రకటించింది. దీంతో ఆ ప్లాంటులో పని చేస్తున్న 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

కొన్నేళ్ల నుంచే అట్లాస్ సహా అన్ని బ్రాండ్ల సైకిళ్ల అమ్మకాలు పడిపోయాయి. అయినా పరిమిత లాభాలతో కంపెనీని నడిపిస్తున్నారు. కానీ కరోనా దెబ్బకు పూర్తిగా అమ్మకాలు ఆగిపోయి ఉద్యోగుల జీతాలు, మెయింటైనెన్స్ కష్టమైపోవడం, కంపెనీ నష్టాల పాలవడంతో ప్లాంటును మూసి వేయక తప్పలేదు.

ఇప్పుడంటే అందరూ బైకులు, కార్లకు బాగా అలవాటు పడిపోయి అవి లేకుండా జీవనం సాగించలేకపోతున్నారు కానీ… ఒక పదిహేనేళ్ల కిందట అయితే సైకిలే మధ్య తరగతికి ప్రధాన వాహనంగా ఉండేది. పిల్లలు, పెద్దలు అందరూ సైకిలే ఉపయోగించేవారు. ప్రతి ఇంట్లో ఒక సైకిల్ కచ్చితంగా ఉండేది. ముఖ్యంగా పల్లెటూళ్లు, చిన్న పట్టణాల్లో సైకిల్ లేకుండా ఏ కుటుంబమూ నడిచేది కాదు.

అప్పట్లో సైకిళ్లకు ఉన్న డిమాండే వేరు. సైకిళ్ల అమ్మకాలతో ఎన్నో దుకాణాలు నడిచేవి. అలాగే సైకిల్ రిపేర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా కనిపించేవి. కానీ గత 15 ఏళ్లలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. జనాల ఆదాయం పెరిగింది. సైకిల్ విడిచిపెట్టి బైకులకు వెళ్లిపోయారు. సైకిల్‌ను చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. దాన్ని తొక్కి గమ్య స్థానాలకు వెళ్లేంత ఓపిక జనాలకు లేకపోయింది. దీంతో సైకిళ్ల అమ్మకాలు బాగా పడిపోయి.. ఇప్పుడు సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల నుంచి అన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

This post was last modified on June 9, 2020 4:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: AtlasCycle

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago