Trends

అట్లాస్ సైకిల్.. ఇక కనిపించదు

అట్లాస్ సైకిల్.. అది కేవలం సైకిల్ కాదు. ఒక ఎమోషన్. భారతీయ ప్రజల జీవనంలో భాగం అయిపోయిన వస్తువది. ఇండియాలో సైకిల్ బ్రాండ్లలో అత్యంత ఆదరణ ఉన్న అట్లాస్.. ఇప్పుడు కనుమరుగు కానుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక అట్లాస్ సైకిల్ ఉండేది. ఐతే మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఈ సైకిల్ బ్రాండ్ ఉత్పత్తిని ఆపేస్తున్నారు.

సైకిళ్లకు అసలు గిరాకీ లేకపోవడం, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో తమ మానుఫ్యాక్చరింగ్ ప్లాంటును మూసి వేస్తున్నట్లు అట్లాస్ కంపెనీ ప్రకటించింది. దీంతో ఆ ప్లాంటులో పని చేస్తున్న 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

కొన్నేళ్ల నుంచే అట్లాస్ సహా అన్ని బ్రాండ్ల సైకిళ్ల అమ్మకాలు పడిపోయాయి. అయినా పరిమిత లాభాలతో కంపెనీని నడిపిస్తున్నారు. కానీ కరోనా దెబ్బకు పూర్తిగా అమ్మకాలు ఆగిపోయి ఉద్యోగుల జీతాలు, మెయింటైనెన్స్ కష్టమైపోవడం, కంపెనీ నష్టాల పాలవడంతో ప్లాంటును మూసి వేయక తప్పలేదు.

ఇప్పుడంటే అందరూ బైకులు, కార్లకు బాగా అలవాటు పడిపోయి అవి లేకుండా జీవనం సాగించలేకపోతున్నారు కానీ… ఒక పదిహేనేళ్ల కిందట అయితే సైకిలే మధ్య తరగతికి ప్రధాన వాహనంగా ఉండేది. పిల్లలు, పెద్దలు అందరూ సైకిలే ఉపయోగించేవారు. ప్రతి ఇంట్లో ఒక సైకిల్ కచ్చితంగా ఉండేది. ముఖ్యంగా పల్లెటూళ్లు, చిన్న పట్టణాల్లో సైకిల్ లేకుండా ఏ కుటుంబమూ నడిచేది కాదు.

అప్పట్లో సైకిళ్లకు ఉన్న డిమాండే వేరు. సైకిళ్ల అమ్మకాలతో ఎన్నో దుకాణాలు నడిచేవి. అలాగే సైకిల్ రిపేర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా కనిపించేవి. కానీ గత 15 ఏళ్లలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. జనాల ఆదాయం పెరిగింది. సైకిల్ విడిచిపెట్టి బైకులకు వెళ్లిపోయారు. సైకిల్‌ను చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. దాన్ని తొక్కి గమ్య స్థానాలకు వెళ్లేంత ఓపిక జనాలకు లేకపోయింది. దీంతో సైకిళ్ల అమ్మకాలు బాగా పడిపోయి.. ఇప్పుడు సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల నుంచి అన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

This post was last modified on June 9, 2020 4:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: AtlasCycle

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

1 hour ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

1 hour ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

3 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

4 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

4 hours ago