అట్లాస్ సైకిల్.. అది కేవలం సైకిల్ కాదు. ఒక ఎమోషన్. భారతీయ ప్రజల జీవనంలో భాగం అయిపోయిన వస్తువది. ఇండియాలో సైకిల్ బ్రాండ్లలో అత్యంత ఆదరణ ఉన్న అట్లాస్.. ఇప్పుడు కనుమరుగు కానుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక అట్లాస్ సైకిల్ ఉండేది. ఐతే మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఈ సైకిల్ బ్రాండ్ ఉత్పత్తిని ఆపేస్తున్నారు.
సైకిళ్లకు అసలు గిరాకీ లేకపోవడం, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో తమ మానుఫ్యాక్చరింగ్ ప్లాంటును మూసి వేస్తున్నట్లు అట్లాస్ కంపెనీ ప్రకటించింది. దీంతో ఆ ప్లాంటులో పని చేస్తున్న 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
కొన్నేళ్ల నుంచే అట్లాస్ సహా అన్ని బ్రాండ్ల సైకిళ్ల అమ్మకాలు పడిపోయాయి. అయినా పరిమిత లాభాలతో కంపెనీని నడిపిస్తున్నారు. కానీ కరోనా దెబ్బకు పూర్తిగా అమ్మకాలు ఆగిపోయి ఉద్యోగుల జీతాలు, మెయింటైనెన్స్ కష్టమైపోవడం, కంపెనీ నష్టాల పాలవడంతో ప్లాంటును మూసి వేయక తప్పలేదు.
ఇప్పుడంటే అందరూ బైకులు, కార్లకు బాగా అలవాటు పడిపోయి అవి లేకుండా జీవనం సాగించలేకపోతున్నారు కానీ… ఒక పదిహేనేళ్ల కిందట అయితే సైకిలే మధ్య తరగతికి ప్రధాన వాహనంగా ఉండేది. పిల్లలు, పెద్దలు అందరూ సైకిలే ఉపయోగించేవారు. ప్రతి ఇంట్లో ఒక సైకిల్ కచ్చితంగా ఉండేది. ముఖ్యంగా పల్లెటూళ్లు, చిన్న పట్టణాల్లో సైకిల్ లేకుండా ఏ కుటుంబమూ నడిచేది కాదు.
అప్పట్లో సైకిళ్లకు ఉన్న డిమాండే వేరు. సైకిళ్ల అమ్మకాలతో ఎన్నో దుకాణాలు నడిచేవి. అలాగే సైకిల్ రిపేర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా కనిపించేవి. కానీ గత 15 ఏళ్లలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. జనాల ఆదాయం పెరిగింది. సైకిల్ విడిచిపెట్టి బైకులకు వెళ్లిపోయారు. సైకిల్ను చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. దాన్ని తొక్కి గమ్య స్థానాలకు వెళ్లేంత ఓపిక జనాలకు లేకపోయింది. దీంతో సైకిళ్ల అమ్మకాలు బాగా పడిపోయి.. ఇప్పుడు సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల నుంచి అన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
This post was last modified on June 9, 2020 4:48 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…