కేరళలో ఓ ఏనుగు విషాదాంతం దేశాన్ని కదిలించింది. ఓ ఏనుగుకు స్థానికులు ఆహారం ఆశ చూపి పైనాపిల్ ఇవ్వగా.. అది తినబోతుండటా దాని లోపలున్న పేలుడు పదార్థాలు పేలి అది తీవ్రంగా గాయపడి.. కొన్ని రోజుల పాటు నొప్పితో అల్లాడి ప్రాణాలు వదిలిందని వార్తలొచ్చాయి.
దీనిపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు స్పందించారు. జంతువుల పట్ల మనిషి క్రూరత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు వేశారు. ఈ క్యాంపైన్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. వ్యవహారం చాలా పెద్దదైపోవడం, కేరళలో ఇలాంటి ఘటనలు సహజం అంటూ ప్రచారం జరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమ్తత్తమైంది.
జిల్లా స్థాయి అధికారుల్ని నియమించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఐతే ఈ విచారణలో వెల్లడైన వాస్తవాలు వేరన్నది అక్కడి మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఆ ఏనుగుకు ఎవరూ ఆహారం ఆశ చూపి దాని మరణానికి కారణం కాలేదని విచారణలో వెల్లడైంది. కేరళలో అటవీ ప్రాంతం ఎక్కువ. చాలామంది అడవుల్లో, అడవులకు సమీపంలో నివాసం ఉంటారు. అడవి పందులు, ఇతర క్రూర జంతువులు వాళ్ల ఇళ్లపై, పంటలపై దాడులు చేయడం ఎప్పుడూ జరిగే విషయమే. వాటిని నివారించడం కోసం ఉచ్చు వేస్తారు. పందుల కోసమే ఇలా పైనాపిల్స్లో మందుగుండు సామగ్రిని పెడతారు. ఐతే వాటి కోసం పెట్టిన పైనాపిల్ను ఏనుగు తినడంతో దాని ప్రాణం పోయింది. ఏనుగుకు అలా జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారులు దాన్ని చేరుకునే సరికే మరణించింది.
దీని కంటే కొన్ని రోజుల ముందు కూడా ఓ ఏనుగు ఇలాగే మరణించినట్లు సమాచారం. ఐతే ఈ ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించినపుడు.. అది గర్భవతి అని తేలడంతో ఈ విషయం బ్లో అప్ అయింది. దాని మీద మానవీయ కథనాలు వచ్చాయి. సెలబ్రెటీలు ఇక రెచ్చిపోయిన కన్నీళ్లు కార్చేశారు.
This post was last modified on June 5, 2020 2:14 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…