దేశీయంగా అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తాజాగా ఒక అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోనే ప్రతిష్ఠాత్మక స్మిత్ సోనియన్ ఆసియన్ ఆర్ట్ నేషనల్ మ్యూజియం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తాజాగా నియమితులయ్యారు. దీని ప్రత్యేకత ఏమంటే.. ప్రపంచంలో అతి పెద్దదైన మ్యూజియంగా అభివర్ణిస్తారు.
విద్య.. పరిశోధనల సముదాయంగా ఉండే ఈ సంస్థలో ట్రస్టు సభ్యురాలిగా నాలుగేళ్లు వ్యవహరించనున్నారు. అంతేకాదు.. బోర్డు సభ్యుల్లో అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమె కావటం విశేషం. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఈ మ్యూజియం బోర్డులో మొత్తం 17 మంది సభ్యులు ఉంటారు. వీరిలో అమెరికా దేశ ప్రధాన న్యాయమూర్తి.. ఆ దేశ ఉపాధ్యక్షుడు.. ఆ దేశానికి చెందిన ముగ్గురుసెనేట్ సభ్యులు.. ఆ దేశ ప్రతినిధుల సభ్యకు చెందిన ముగ్గురు సభ్యులు.. తొమ్మిది మంది పౌరులు ఉంటారు. అలాంటి కొమ్ములు తిరిగిన పవర్ ఫుల్ సభ్యుల నడుమ ఈషా స్థానం దక్కించుకోవటం విశేషంగా చెప్పాలి.
స్మిత్ సోనియన్ మ్యూజియం పరిపాలనా బాధ్యతల్ని ఈ బోర్డు నిర్వహిస్తుంది. దీన్ని 1923లో ప్రారంభించారు. ఇందులో నియోలిథిక్ కాలం నుంచి నేటి కాలానికి చెందిన 45 వేలకు పైగా అరుదైన వస్తువులు.. కళాఖండాలు ఉంటాయి. ఇందులో చైనా.. జపాన్.. కొరియా.. దక్షిణాషియా.. ఆగ్రేయాషియాకు చెందినవి ఉన్నాయి. భారత్ తో పాటు ఆసియా కళలు.. కల్చర్ పట్ల మరింత అవగాహన పెంచటానికి.. అందరికి చేరువ కావటానికి ఇషా అంబానీ దార్శనికత.. బలమైన ఆకాంక్ష తాజా నియామకంతో తోడ్పడతాయని ట్రస్టు బోర్డు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on October 28, 2021 10:10 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…