ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి పనిగంటల విషయంలో ఐస్ ల్యాండ్ ప్రపంచదేశాలకు కొత్త మోడల్ గా అవతరించబోతోందా ? మానసిక శాస్త్రవేత్తలు, నిపుణుల లెక్కల ప్రకారం అవుననే సమాధానం వినబడుతోంది. పనిగంటలు తగ్గించటం, పనిదినాల్లో మార్పులు చేసే విషయంలో ఐస్ ల్యాండ్ లో నాలుగేళ్ల పాటు జరిగిన ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో ఐస్ ల్యాండ్ లో జరిగిన ప్రయోగాలను తెలుసుకునే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగులకు, కార్మికులకు పని విషయమై బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగులైనా, కార్మికులైనా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ నిబంధనలను కచ్చితంగా పాటేంచే దేశాలు, యాజమాన్యాలు ఎన్నున్నాయంటే సరైన సమాధానం దొరకదు. అందుకనే ఇదే విషయమై ఐస్ ల్యాండ్ లో 2015-2019 మధ్య ఓ అధ్యయనం జరిగింది. వివిధ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు, అనేక కంపెనీల్లో పనిచేసే కార్మికులను రకరకాలుగా వర్గీకరించారు.
మొత్తం 2500 మందిని ఎంపిక చేసి ఐస్ ల్యాండ్ ప్రయోగాలు చేసింది. దీని సారాంశం ఏమిటంటే ఇతర ఉద్యోగులు, కార్మికులకంటే పనిగంటలు తగ్గిన ఉద్యోగులు, కార్మికులు అలాగే పనిదినాలు తగ్గిన కార్మికులు, ఉద్యోగుల్లో పనిచేసే సామర్ధ్యం బాగా పెరిగిందట. మామూలుగా అయితే కార్మికులైనా, ఉద్యోగులైనా వారానికి 44.4 గంటలు పనిచేయాల్సిందేనట ఐస్ ల్యాండ్ లో కూడా. అయితే ఎంపిక చేసుకున్న ఉద్యోగులు, కార్మికుల పని గంటలను 36-40 గంటలు తగ్గించేశారట.
ఈ అధ్యయనంలో ఎంపిక చేసిన వారిలో పనిచేసే సామర్థ్యం అంతకుముందు కన్నా బాగా పెరిగినట్లు తేలింది. మామూలుగా అయితే ఉదయం ఉద్యోగులు, కార్మికులు పని మొదలు పెట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహం సాయంత్రానికి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగులు, కార్మికుల్లో ఉదయం వచ్చినపుడున్న ఉత్సాహమే సాయంత్రం పని ముగించే సమయంలో కూడా ఉందని తేలింది. కారణం ఏమిటంటే పనిగంటలు తగ్గటంతో పాటు వారానికి 4 రోజులే పనిచేయటం.
అంటే అంతకు ముందు 8 గంటల్లో చేసిన పనినే ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులు, కార్మికులు ఆరు గంటల్లోనే పూర్తి చేశారు. అలాగే వారానికి ఐదురోజుల పనిదినాలకు బదులు 4 రోజులే పని చేయించుకోవటం పని సామర్ధ్యం పెరగడానికి కారణమైందట. దీంతో కొత్త ప్రయోగాన్నే ఐస్ ల్యాండ్ లో అమలు చేయటానికి అక్కడి ప్రభుత్వం రెడీ అయిపోతోంది. మరి ఇదే ఫార్ములాను తొందరలో ఎన్ని దేశాలు ఫాలో అవుతాయో చూడాలి.
This post was last modified on October 20, 2021 5:36 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…