సుడిగాడు అంటే వీడేరా? అన్నట్లు అనిపించే ఉదంతమిది. అదే సమయంలో.. ఎంత లక్ ఉన్నా కానీ దరిద్రం మాత్రం అతగాడి వెంట పడుతూనే ఉందన్నట్లుగా ఉండే ఈ వ్యవహారం చాలా సిత్రంగా ఉంటుంది. యూఏఈలో ఉండే ప్రవాస భారతీయుడు ఒకరు (నహీల్ నిజాముద్దీన్) యూఏఈలో పని చేస్తున్నాడు. ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబుదాబి సిరీస్232 డ్రాలో ఇతగాడు ఏకంగా రూ.20 కోట్లకు విజేతయ్యాడు. సెప్టెంబరు 26న లాటరీ టిక్కెట్ కొన్న అతడు కాంటాక్టు నెంబర్ల కింద రెండు ఫోన్ నెంబర్లు.. కేరళలోని తన పర్మినెంట్ అడ్రస్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. లాటరీ తగిలి.. అతని పేరును ప్రకటించారు కానీ.. తానే విజేతనంటూ నిర్వాహకుల వద్దకు రాలేదు. అతడికి ఇప్పటివరకు అధికారిక సమాచారం వెళ్లలేదు. దీనికి కారణం అతడు కేరళ అడ్రస్ ఇవ్వటమేనని చెబుతున్నారు. అతను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లు పని చేయకపోవటంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతడి గురించి ప్రాథమిక వివరాల కోసం లాటరీ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అతను అబుదాబిలో ఉంటాడన్న ప్రాథమిక సమాచారాన్ని గుర్తించారు.
అయితే.. విజేతకు తాను గెలుచుకున్న లాటరీ సొమ్ము మొత్తాన్ని అందజేసే వరకు మాత్రం తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉంటామని సదరు సంస్థ చెబుతోంది. ఈ మొత్తం ఉదంతం విన్నంతనే దురదృష్టం ఒక్కోసారి అదృష్టం కంటే కూడా బలమైనది ఏమో అనిపిస్తుంది.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…