సుడిగాడు అంటే వీడేరా? అన్నట్లు అనిపించే ఉదంతమిది. అదే సమయంలో.. ఎంత లక్ ఉన్నా కానీ దరిద్రం మాత్రం అతగాడి వెంట పడుతూనే ఉందన్నట్లుగా ఉండే ఈ వ్యవహారం చాలా సిత్రంగా ఉంటుంది. యూఏఈలో ఉండే ప్రవాస భారతీయుడు ఒకరు (నహీల్ నిజాముద్దీన్) యూఏఈలో పని చేస్తున్నాడు. ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబుదాబి సిరీస్232 డ్రాలో ఇతగాడు ఏకంగా రూ.20 కోట్లకు విజేతయ్యాడు. సెప్టెంబరు 26న లాటరీ టిక్కెట్ కొన్న అతడు కాంటాక్టు నెంబర్ల కింద రెండు ఫోన్ నెంబర్లు.. కేరళలోని తన పర్మినెంట్ అడ్రస్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. లాటరీ తగిలి.. అతని పేరును ప్రకటించారు కానీ.. తానే విజేతనంటూ నిర్వాహకుల వద్దకు రాలేదు. అతడికి ఇప్పటివరకు అధికారిక సమాచారం వెళ్లలేదు. దీనికి కారణం అతడు కేరళ అడ్రస్ ఇవ్వటమేనని చెబుతున్నారు. అతను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లు పని చేయకపోవటంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతడి గురించి ప్రాథమిక వివరాల కోసం లాటరీ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అతను అబుదాబిలో ఉంటాడన్న ప్రాథమిక సమాచారాన్ని గుర్తించారు.
అయితే.. విజేతకు తాను గెలుచుకున్న లాటరీ సొమ్ము మొత్తాన్ని అందజేసే వరకు మాత్రం తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉంటామని సదరు సంస్థ చెబుతోంది. ఈ మొత్తం ఉదంతం విన్నంతనే దురదృష్టం ఒక్కోసారి అదృష్టం కంటే కూడా బలమైనది ఏమో అనిపిస్తుంది.
This post was last modified on October 5, 2021 8:34 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…