మిస్టర్ కూల్… ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం..!

MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీకి భారత మిలిటరీ లోని గౌరవ లెఫ్ట్నెంట్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు పొందిన మహేంద్రసింగ్ ధోని… పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కి మరో అరుదైన గౌరవం ఇచ్చింది మిలటరీ. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (ఎన్ సి సి) రివ్యూ చేసే 15మంది డిఫెన్స్ మినిస్టర్ ఈ కమిటీలో మహేంద్ర సింగ్ ధోనీ కి చోటు దక్కింది.

ఎన్సిసి పై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు, జాతీయ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది మిలటరీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త , మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరియు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు. ఎన్ సి సి లోని మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.