జేఈఈ మొయిన్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన ఈ ఫలితాలలో.. ఫలితాలలో దాదాపు 44 మంది అభ్యర్థులు 100శాతం సాధించడం గమనార్హం. కాగా.. వారిలో 18మందికి ఫస్ట్ ర్యాంకు రావడం గమనార్హం.
కాగా.. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇద్దరు.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు నలుగురు ఉండటం విశేషం. కాగా.. మొత్తం 9,34,602 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొమ్మ శరణ్య, జోస్యూల వెంకట ఆదిత్య ఫస్ట్ ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన దుగ్గినేని వెంకట పనీష్, పసల వీరశివ, కుంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్ సాధించిన వారిలో ఉన్నారు.
జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గుజరాతి, అస్సామీస్, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు.
This post was last modified on September 15, 2021 9:36 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…