Trends

ధావ‌న్ ఆమె నుంచి విడిపోయాడు


పెళ్ల‌యి ఇద్ద‌రు పిల్ల‌లున్న మ‌హిళ‌ను పెళ్లాడి తొమ్మిదేళ్ల‌ కింద‌ట ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నాడనుకుంటున్న స‌మ‌యంలో త‌న నుంచి విడాకులు తీసుకున్నాడన్న వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రేలియా మ‌హిళ అయిన ఆయేషా ముఖ‌ర్జీని 2012లో పెళ్లాడాడు. అప్ప‌టికి ధావ‌న్ వ‌య‌సు 26 ఏళ్లు కాగా.. ఆయేషాకు 37 సంవ‌త్స‌రాలు. ఒక‌ప్ప‌టి బాక్స‌ర్ అయిన ఆయేషాకు అప్ప‌టికే పెళ్ల‌యింది. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

అయినా స‌రే.. ఆమెతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాడు ధావ‌న్. త‌ర్వాత వీళ్లిద్ద‌రికీ ఒక బాబు పుట్టాడు. ధావ‌న్ ఎక్క‌డ క్రికెట్ ఆడినా అక్క‌డ ఆయేషా పిల్ల‌ల‌తో స‌హా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ధావ‌న్ భార్య, పిల్ల‌లు ఎన్నోసార్లు సంద‌డి చేశారు. ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఆయేషాతో పెళ్లి త‌ర్వాత‌ ధావ‌న్ ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా మారిపోయాడు. భార్యా పిల్ల‌ల‌తో అనేక‌సార్లు విహార యాత్ర‌ల‌కు వెళ్లి ఆ ఫోటోలూ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఎంతో సాఫీగా సాగిపోతున్న‌ట్లు క‌నిపించిన వీరి వైవాహిక జీవితంలో ఎందుకు విభేదాలు వ‌చ్చాయో తెలియ‌దు కానీ.. వీరి విడాకులు వార్త అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆల్రెడీ వీళ్లిద్ద‌రూ విడి విడిగా ఉంటున్నార‌ని.. విడాకుల ప్ర‌క్రియ కూడా పూర్తయింద‌ని అంటున్నారు.

ఐతే దీని గురించి ధావ‌న్, ఆయేషాల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. చివ‌ర‌గా ధావ‌న్ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో క‌నిపించాడు. అత‌డి నాయ‌క‌త్వంలోనే భార‌త రెండో జ‌ట్టు లంక‌లో ప‌ర్య‌టించింది. ఏడాదిన్న‌ర‌గా క‌రోనా కార‌ణంగా క్రికెట‌ర్ల వెంట భార్యా పిల్ల‌లు వెళ్ల‌డం త‌గ్గిపోవ‌డం ధావ‌న్ త‌న భార్య‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి బ‌య‌టికి వెల్ల‌డి కాలేదు.

This post was last modified on September 8, 2021 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

51 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago