Trends

ధావ‌న్ ఆమె నుంచి విడిపోయాడు


పెళ్ల‌యి ఇద్ద‌రు పిల్ల‌లున్న మ‌హిళ‌ను పెళ్లాడి తొమ్మిదేళ్ల‌ కింద‌ట ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నాడనుకుంటున్న స‌మ‌యంలో త‌న నుంచి విడాకులు తీసుకున్నాడన్న వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రేలియా మ‌హిళ అయిన ఆయేషా ముఖ‌ర్జీని 2012లో పెళ్లాడాడు. అప్ప‌టికి ధావ‌న్ వ‌య‌సు 26 ఏళ్లు కాగా.. ఆయేషాకు 37 సంవ‌త్స‌రాలు. ఒక‌ప్ప‌టి బాక్స‌ర్ అయిన ఆయేషాకు అప్ప‌టికే పెళ్ల‌యింది. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

అయినా స‌రే.. ఆమెతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాడు ధావ‌న్. త‌ర్వాత వీళ్లిద్ద‌రికీ ఒక బాబు పుట్టాడు. ధావ‌న్ ఎక్క‌డ క్రికెట్ ఆడినా అక్క‌డ ఆయేషా పిల్ల‌ల‌తో స‌హా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ధావ‌న్ భార్య, పిల్ల‌లు ఎన్నోసార్లు సంద‌డి చేశారు. ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఆయేషాతో పెళ్లి త‌ర్వాత‌ ధావ‌న్ ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా మారిపోయాడు. భార్యా పిల్ల‌ల‌తో అనేక‌సార్లు విహార యాత్ర‌ల‌కు వెళ్లి ఆ ఫోటోలూ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఎంతో సాఫీగా సాగిపోతున్న‌ట్లు క‌నిపించిన వీరి వైవాహిక జీవితంలో ఎందుకు విభేదాలు వ‌చ్చాయో తెలియ‌దు కానీ.. వీరి విడాకులు వార్త అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆల్రెడీ వీళ్లిద్ద‌రూ విడి విడిగా ఉంటున్నార‌ని.. విడాకుల ప్ర‌క్రియ కూడా పూర్తయింద‌ని అంటున్నారు.

ఐతే దీని గురించి ధావ‌న్, ఆయేషాల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. చివ‌ర‌గా ధావ‌న్ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో క‌నిపించాడు. అత‌డి నాయ‌క‌త్వంలోనే భార‌త రెండో జ‌ట్టు లంక‌లో ప‌ర్య‌టించింది. ఏడాదిన్న‌ర‌గా క‌రోనా కార‌ణంగా క్రికెట‌ర్ల వెంట భార్యా పిల్ల‌లు వెళ్ల‌డం త‌గ్గిపోవ‌డం ధావ‌న్ త‌న భార్య‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి బ‌య‌టికి వెల్ల‌డి కాలేదు.

This post was last modified on September 8, 2021 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago