పెళ్లయి ఇద్దరు పిల్లలున్న మహిళను పెళ్లాడి తొమ్మిదేళ్ల కిందట ఆశ్చర్యపరిచిన టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్.. ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నాడనుకుంటున్న సమయంలో తన నుంచి విడాకులు తీసుకున్నాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళ అయిన ఆయేషా ముఖర్జీని 2012లో పెళ్లాడాడు. అప్పటికి ధావన్ వయసు 26 ఏళ్లు కాగా.. ఆయేషాకు 37 సంవత్సరాలు. ఒకప్పటి బాక్సర్ అయిన ఆయేషాకు అప్పటికే పెళ్లయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయినా సరే.. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు ధావన్. తర్వాత వీళ్లిద్దరికీ ఒక బాబు పుట్టాడు. ధావన్ ఎక్కడ క్రికెట్ ఆడినా అక్కడ ఆయేషా పిల్లలతో సహా ప్రత్యక్షమవుతుంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల్లో ధావన్ భార్య, పిల్లలు ఎన్నోసార్లు సందడి చేశారు. ఆకర్షణగా నిలిచారు.
ఆయేషాతో పెళ్లి తర్వాత ధావన్ పక్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా మారిపోయాడు. భార్యా పిల్లలతో అనేకసార్లు విహార యాత్రలకు వెళ్లి ఆ ఫోటోలూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎంతో సాఫీగా సాగిపోతున్నట్లు కనిపించిన వీరి వైవాహిక జీవితంలో ఎందుకు విభేదాలు వచ్చాయో తెలియదు కానీ.. వీరి విడాకులు వార్త అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆల్రెడీ వీళ్లిద్దరూ విడి విడిగా ఉంటున్నారని.. విడాకుల ప్రక్రియ కూడా పూర్తయిందని అంటున్నారు.
ఐతే దీని గురించి ధావన్, ఆయేషాల నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు. చివరగా ధావన్ శ్రీలంక పర్యటనలో కనిపించాడు. అతడి నాయకత్వంలోనే భారత రెండో జట్టు లంకలో పర్యటించింది. ఏడాదిన్నరగా కరోనా కారణంగా క్రికెటర్ల వెంట భార్యా పిల్లలు వెళ్లడం తగ్గిపోవడం ధావన్ తన భార్యకు దూరంగా ఉంటున్న సంగతి బయటికి వెల్లడి కాలేదు.
This post was last modified on September 8, 2021 10:08 am
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…