Trends

ధావ‌న్ ఆమె నుంచి విడిపోయాడు


పెళ్ల‌యి ఇద్ద‌రు పిల్ల‌లున్న మ‌హిళ‌ను పెళ్లాడి తొమ్మిదేళ్ల‌ కింద‌ట ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నాడనుకుంటున్న స‌మ‌యంలో త‌న నుంచి విడాకులు తీసుకున్నాడన్న వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రేలియా మ‌హిళ అయిన ఆయేషా ముఖ‌ర్జీని 2012లో పెళ్లాడాడు. అప్ప‌టికి ధావ‌న్ వ‌య‌సు 26 ఏళ్లు కాగా.. ఆయేషాకు 37 సంవ‌త్స‌రాలు. ఒక‌ప్ప‌టి బాక్స‌ర్ అయిన ఆయేషాకు అప్ప‌టికే పెళ్ల‌యింది. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

అయినా స‌రే.. ఆమెతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాడు ధావ‌న్. త‌ర్వాత వీళ్లిద్ద‌రికీ ఒక బాబు పుట్టాడు. ధావ‌న్ ఎక్క‌డ క్రికెట్ ఆడినా అక్క‌డ ఆయేషా పిల్ల‌ల‌తో స‌హా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ధావ‌న్ భార్య, పిల్ల‌లు ఎన్నోసార్లు సంద‌డి చేశారు. ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఆయేషాతో పెళ్లి త‌ర్వాత‌ ధావ‌న్ ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా మారిపోయాడు. భార్యా పిల్ల‌ల‌తో అనేక‌సార్లు విహార యాత్ర‌ల‌కు వెళ్లి ఆ ఫోటోలూ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఎంతో సాఫీగా సాగిపోతున్న‌ట్లు క‌నిపించిన వీరి వైవాహిక జీవితంలో ఎందుకు విభేదాలు వ‌చ్చాయో తెలియ‌దు కానీ.. వీరి విడాకులు వార్త అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆల్రెడీ వీళ్లిద్ద‌రూ విడి విడిగా ఉంటున్నార‌ని.. విడాకుల ప్ర‌క్రియ కూడా పూర్తయింద‌ని అంటున్నారు.

ఐతే దీని గురించి ధావ‌న్, ఆయేషాల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. చివ‌ర‌గా ధావ‌న్ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో క‌నిపించాడు. అత‌డి నాయ‌క‌త్వంలోనే భార‌త రెండో జ‌ట్టు లంక‌లో ప‌ర్య‌టించింది. ఏడాదిన్న‌ర‌గా క‌రోనా కార‌ణంగా క్రికెట‌ర్ల వెంట భార్యా పిల్ల‌లు వెళ్ల‌డం త‌గ్గిపోవ‌డం ధావ‌న్ త‌న భార్య‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి బ‌య‌టికి వెల్ల‌డి కాలేదు.

This post was last modified on September 8, 2021 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

10 minutes ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

3 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

5 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago