ఓ యువకుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమలో దింపాడు. అయితే.. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎవరికి పెళ్లాడాలో మాత్రం అర్థం కాలేదు. దీంతో.. ఆ యువకుడికి గ్రామస్థులే పరిష్కారం చూపించారు. ఆ ఇద్దరు అమ్మాయిల పేరుతో చీటి రాసి.. లాటరీ తీసి.. పెళ్లి చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాజన జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఇద్దరినీ సోషల్ మీడియా లో పరిచయం చేసుకుంది ప్రేమించాడు. ఆ యువతులు కూడా అతడిని గాఢంగా ప్రేమించారు.
అయితే ఇద్దరు యువతులు కూడా తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరిలో ఓ యువతి విషం తాగింది. చివరికి ఈ విషయం పై గ్రామంలో పంచాయితీ జరిగింది. దాంతో పెద్దలు చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వారిని పెళ్లి చేసుకోవాలని తీర్పు ఇచ్చారు. చీటీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరు వచ్చింది. దాంతో మరో యువతి యువకుడి చెంపలు వాయించి నన్ను మోసం చేశావ్..నిన్ను వదలను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తరవాత పెద్దల సమక్షం లో యువకుడి పెళ్లి జరిగింది.
This post was last modified on September 6, 2021 12:06 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…