ఓ యువకుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమలో దింపాడు. అయితే.. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎవరికి పెళ్లాడాలో మాత్రం అర్థం కాలేదు. దీంతో.. ఆ యువకుడికి గ్రామస్థులే పరిష్కారం చూపించారు. ఆ ఇద్దరు అమ్మాయిల పేరుతో చీటి రాసి.. లాటరీ తీసి.. పెళ్లి చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాజన జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఇద్దరినీ సోషల్ మీడియా లో పరిచయం చేసుకుంది ప్రేమించాడు. ఆ యువతులు కూడా అతడిని గాఢంగా ప్రేమించారు.
అయితే ఇద్దరు యువతులు కూడా తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరిలో ఓ యువతి విషం తాగింది. చివరికి ఈ విషయం పై గ్రామంలో పంచాయితీ జరిగింది. దాంతో పెద్దలు చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వారిని పెళ్లి చేసుకోవాలని తీర్పు ఇచ్చారు. చీటీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరు వచ్చింది. దాంతో మరో యువతి యువకుడి చెంపలు వాయించి నన్ను మోసం చేశావ్..నిన్ను వదలను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తరవాత పెద్దల సమక్షం లో యువకుడి పెళ్లి జరిగింది.
This post was last modified on September 6, 2021 12:06 pm
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…
తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…
వైసీపీ అధినేత జగన్.. తన సతీమణి భారతితో కలిసి.. యూరప్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…