అంతకంతకూ దూసుకెళుతూ ముందుకెళుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మరో రికార్డుకు చేరువయ్యారు. ఆయన వ్యక్తిగత ఆస్తులు 10వేల కోట్ల డాలర్లకు దగ్గరకు రానున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.7.30లక్షల కోట్ల సంపదనకు ఆయన చేరువయ్యారు. మరికాస్త ముందుకెళితే చాలు.. ప్రపంచంలో అతి తక్కువ మందికి సాధ్యమయ్యే పని ఆయనకు సొంతం కానుంది. ఈ హోదాను సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా అంబానీ నిలవనున్నారు.
తాజాగా విడుదల చేసిన బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. శుక్రవారం నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తి 9260 డాలర్లు. అంటే.. పదివేల కోట్ల డాలర్లకు ఆయన కేవలం 740 కోట్ల డాలర్ల దూరంలోనే ఉన్నారు. మామూలుగా అయితే 740 కోట్ల డాలర్లు అంటే మాటలు కాదు. కానీ.. ముకేశ్ అంబానీకిఇదేం పెద్ద విషయం కాదు. ఆయన రిలయన్స్ కంపెనీ షేర్ అంతకంతకూ దూసుకెళుతోంది. తాజాగా పెరిగిన ధరతో ఆయనీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటున్నారు. రిలయన్స్ షేర్ ర్యాలీ మరికాస్త జోరందుకుంటే చాలు ఆయన 10వేల కోట్ల డాలర్ల క్లబ్ లోకి చేరిపోతారు.
ప్రపంచంలో కేవలం పది మంది మాత్రమే ఈ స్థాయి సంపదను కలిగి ఉన్నారు. శుక్రవారం ఆయన కంపెనీ షేర్ ధర పెరగటంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.15 లక్షల కోట్లకు చేరుకోవటం గమనార్హం. మరెన్ని రోజుల వ్యవధిలో ఈ అరుదైన రికార్డును ముకేశ్ అంబానీ తన వశం చేసుకుంటారో చూడాలి.
This post was last modified on September 5, 2021 10:43 am
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…