ఒకప్పుడు.. భర్త చనిపోతే.. అతని చితిలోనే బలవంతంగానైనా భార్యను కూర్చోపెట్టి దహనం చేసేవారు. దానిని సతీ సహగమనం అనేవారు. ఆ తర్వాత కాల క్రమేనా ఆ మూఢ నమ్మకాన్ని అందరూ వదిలేశారు. అయితే.. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే.. కొంచెం రివర్స్. ఇక్కడ చనిపోయింది భర్త కాదు.. భార్య. తనకు భార్య పై ఉన్న అమితమైన ప్రేమను ఆ వ్యక్తి ఇలా ప్రాణార్పణం చేసి అందరికీ చాటిచెప్పాడు. భార్య చితిలో తాను కూడా దూకేశాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శైలు జోడి గ్రామానికి చెందిన రాయబారి (60), నీలమణి శబర (65) ఇద్దరు భార్యా భర్తలు. వీరికి నలుగురు కుమారులు కూడా ఉన్నారు. రాయబారి మంగళ వారం రోజున గుండె పోటు తో మరణించింది. దీంతో అంత్య క్రియల కోసం మృతి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితి పేర్చి మృత దేహానికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇళ్లకు బయలు దేరారు.
అందరితో పాటే ఇంటికి బయలు దేరిన నీలమణి ఆ తర్వాత… ఒక్క ఉదుటున వెనక్కి పరిగెత్తు కొచ్చి భార్య చితి మంటలలో దూకేశాడు. అందరూ చూస్తుండగానే.. అతడు భార్య తో సహా దహనమయ్యాడు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య లేకుండా బతకలేనని భావించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
This post was last modified on August 26, 2021 3:21 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…