ఒకప్పుడు.. భర్త చనిపోతే.. అతని చితిలోనే బలవంతంగానైనా భార్యను కూర్చోపెట్టి దహనం చేసేవారు. దానిని సతీ సహగమనం అనేవారు. ఆ తర్వాత కాల క్రమేనా ఆ మూఢ నమ్మకాన్ని అందరూ వదిలేశారు. అయితే.. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే.. కొంచెం రివర్స్. ఇక్కడ చనిపోయింది భర్త కాదు.. భార్య. తనకు భార్య పై ఉన్న అమితమైన ప్రేమను ఆ వ్యక్తి ఇలా ప్రాణార్పణం చేసి అందరికీ చాటిచెప్పాడు. భార్య చితిలో తాను కూడా దూకేశాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శైలు జోడి గ్రామానికి చెందిన రాయబారి (60), నీలమణి శబర (65) ఇద్దరు భార్యా భర్తలు. వీరికి నలుగురు కుమారులు కూడా ఉన్నారు. రాయబారి మంగళ వారం రోజున గుండె పోటు తో మరణించింది. దీంతో అంత్య క్రియల కోసం మృతి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితి పేర్చి మృత దేహానికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇళ్లకు బయలు దేరారు.
అందరితో పాటే ఇంటికి బయలు దేరిన నీలమణి ఆ తర్వాత… ఒక్క ఉదుటున వెనక్కి పరిగెత్తు కొచ్చి భార్య చితి మంటలలో దూకేశాడు. అందరూ చూస్తుండగానే.. అతడు భార్య తో సహా దహనమయ్యాడు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య లేకుండా బతకలేనని భావించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
This post was last modified on August 26, 2021 3:21 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…