దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలు.. అన్నింతా తామై ముందుకు వెళుతున్నారు. అంతెందుకు.. మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో సైతం.. అమ్మాయిలే ఎక్కువ పతకాలు గెలవడం గమనార్హం. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నా.. ఇంకా వారిపై చిన్నచూపు చూసేవారు లేకపోలేదు.. ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టకూడదని తన భార్యకు ఏకంగా 8 సార్లు అబార్షన్ చేయించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయికి చెందిన ఓ యువతికి 2007లో వివాహమైంది. ఆమెను బాగా సంపన్న కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. పెళ్లైన కొంతకాలానికే ఆమెకు వేధింపులు మొదలుకావడం గమనార్హం. 2009లో ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ ఆమెకు అబార్షన్ చేయించాడు.
ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్థారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్ తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఆమెకు దాదాపు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. చికిత్స, ఆయా పరీక్ష సమయంలో ఆమెకు 1500 పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు.
ఇన్ని చేస్తున్నా మౌనంగా భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సభ్య సమాజం భగ్గుమంటోంది. కొడుకు కోసం ఇంతటి దారుణాలకు పాల్పడమేంటని అంతా మండి పడుతున్నారు.
This post was last modified on August 18, 2021 12:47 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…