దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలు.. అన్నింతా తామై ముందుకు వెళుతున్నారు. అంతెందుకు.. మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో సైతం.. అమ్మాయిలే ఎక్కువ పతకాలు గెలవడం గమనార్హం. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నా.. ఇంకా వారిపై చిన్నచూపు చూసేవారు లేకపోలేదు.. ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టకూడదని తన భార్యకు ఏకంగా 8 సార్లు అబార్షన్ చేయించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయికి చెందిన ఓ యువతికి 2007లో వివాహమైంది. ఆమెను బాగా సంపన్న కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. పెళ్లైన కొంతకాలానికే ఆమెకు వేధింపులు మొదలుకావడం గమనార్హం. 2009లో ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ ఆమెకు అబార్షన్ చేయించాడు.
ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్థారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్ తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఆమెకు దాదాపు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. చికిత్స, ఆయా పరీక్ష సమయంలో ఆమెకు 1500 పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు.
ఇన్ని చేస్తున్నా మౌనంగా భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సభ్య సమాజం భగ్గుమంటోంది. కొడుకు కోసం ఇంతటి దారుణాలకు పాల్పడమేంటని అంతా మండి పడుతున్నారు.
This post was last modified on August 18, 2021 12:47 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…