దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలు.. అన్నింతా తామై ముందుకు వెళుతున్నారు. అంతెందుకు.. మొన్న జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో సైతం.. అమ్మాయిలే ఎక్కువ పతకాలు గెలవడం గమనార్హం. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నా.. ఇంకా వారిపై చిన్నచూపు చూసేవారు లేకపోలేదు.. ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టకూడదని తన భార్యకు ఏకంగా 8 సార్లు అబార్షన్ చేయించాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయికి చెందిన ఓ యువతికి 2007లో వివాహమైంది. ఆమెను బాగా సంపన్న కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. పెళ్లైన కొంతకాలానికే ఆమెకు వేధింపులు మొదలుకావడం గమనార్హం. 2009లో ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ ఆమెకు అబార్షన్ చేయించాడు.
ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్థారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్ తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఆమెకు దాదాపు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. చికిత్స, ఆయా పరీక్ష సమయంలో ఆమెకు 1500 పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు.
ఇన్ని చేస్తున్నా మౌనంగా భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సభ్య సమాజం భగ్గుమంటోంది. కొడుకు కోసం ఇంతటి దారుణాలకు పాల్పడమేంటని అంతా మండి పడుతున్నారు.
This post was last modified on August 18, 2021 12:47 pm
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…